డాలర్తో పోలిస్తే బుధవారం కంటే బలహీనపడిన రూపాయి: 68.99 వద్ద ముగింపు
ముంబై: డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపీనపడింది. ఉదయం ఉత్సాహంతో ప్రారంభమైన మార్కెట్లు కూడా వారంతం క్లోజింగ్లో మాత్రం నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా బలహీనపడింది. బుధవారం 68.83 పైసల వద్ద క్లోజ్ అయింది. శుక్రవారం శుభారంభం కనిపించింది. కానీ సాయంత్రానికి బలహీనపడింది. బుధవారం క్లోజింగ్ (68.82) కంటే పదిహేడు పైసలు పెరిగి 68.99 వద్ద ముగిసింది.
పెరుగుతున్న డెబిట్ కార్డులు, తగ్గుతున్న ఏటీఎంలు: ఇబ్బందులకు కారణాలివే
బుధవారం నాడు రూపాయి 68.83 పైసల వద్ద క్లోజ్ అయింది. గురువారం హోలీ పర్వదినం సందర్భంగా మార్కెట్లు లేవు. శుక్రవారం ఉదయం 68.60 పైసల వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో బుధవారం క్లోజింగ్ కంటే 30 పైసలు తగ్గి 68.53 వద్ద కొనసాగింది.
స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 222 పాయింట్లు నష్టపోయి 38,164 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 11,462 వద్ద ముగిశాయి. భారీ కంపెనీల షేర్లు నష్టపోవడం నేటి మార్కెట్ను కుంగదీసింది. రిలయన్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, కొటక్ బ్యాంక్ షేర్లు కుంగాయి.
నిఫ్టీ ప్రధాన సూచీతో పాటు, స్థిరాస్తి రంగ సూచీ కూడా బాగా నష్టపోయింది. శుక్రవారం ఫిచ్ సంస్థ భారత్ రేటింగ్ను తగ్గించి 6.8గా ప్రకటించింది. ఇండిగో నేషన్ మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు, స్పైస్ జెట్ షేర్లు లబ్ధిపొందాయి. ఎల్ అండ్ టీ షేర్లు కూడా దాదాపు మూడు శాతం పెరిగాయి.