ముంబై: జెట్ ఎయిర్వేస్ గత మూడు నెలలుగా పైలట్లు సహా తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో పైలట్లు కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఏప్రిల్ 1వ తేదీలోపు తమ వేతనాలు చెల్లించకుంటే తాము విమానాలు ఆపేస్తామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో పైలట్లు తమ కష్టాలను వెళ్లగక్కుతున్నారు. నిత్యావసర ఖర్చుల కోసం ఇంట్లోని తమ నగలను తాకట్టు పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెట్ పైలట్ల యూనియన్ హెడ్ కెప్టెన్ కరణ్ చోప్రా విమానయాన శాఖకు రాసిన లేఖలో పలు అంశాలను పేర్కొన్నారు. సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

విమానాల భద్రతపై ప్రభావం చూపే ప్రమాదం
విమానం కాక్పిట్లోకి వెళ్లగానే ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తామని, కానీ తాము కూడా సాధారణ మనుషులమేనని, జీతాలు రావట్లేదని ఒత్తిడి కారణంగా తాము కాక్పిట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని, ఇది విమానాల భద్రతపై ప్రభావం చూపే ప్రమాదముందని, కంపెనీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ తమకు స్పష్టమైన సమాచారం లేదని, ఎస్బీఐ లాంటి రుణదాతలు జెట్ సమస్యను గట్టెక్కించగలరా అన్నది తెలియరావట్లేదు అని ఆ లేఖలో పేర్కొన్నారు. పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు, నిత్యావసర వస్తువుల కోసం పైలట్లు అవస్థలు పడుతున్నారని, కొందరు అయితే డబ్బుల కోసం తమ తల్లి నగలు తాకట్టు పెడుతున్నారన్నారు.

సర్.. తల్లి నగలు తాకట్టు పెట్టా
పైలట్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కెప్టెన్ చోప్రా అన్నారు. పైలట్లు తమ తమ ఈఎంఐలు కూడా చెల్లించాల్సి ఉందని చెప్పారు. పిల్ల చదువులు, ఆసుపత్రి ఖర్చులతో పాటు ప్రస్తుత పరిస్థితి కారణంగా వారి ఇళ్లలోని పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కొంతమంది పైలట్లు తనను సంప్రదించి.. సర్ మేం నా తల్లి నగలు కుదువపెట్టానని చెబుతున్నారని, వారి పరిస్థితి చూస్తుంటే బాధాకరంగా ఉందని చెప్పారు. కాబట్టి తమ వేతనాలు చెల్లించాలని యాజమాన్యానికి చెప్పాలని కోరారు.

రెండు డిమాండ్లు
మరో కెప్టెన్ ఆసిమ్ వలియాని మాట్లాడుతూ... ఒకవేళ కంపెనీ దివాలా తీస్తే 1500 మంది పైలట్లు రోడ్డుమీద పడతారని, అందరికీ వెంటనే ఉద్యోగాలు వస్తాయో రావో కూడా తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ జీతాలు చెల్లించకుంటే వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి విధులకు హాజరుకాబోమని, ఇందుకు 1100 మంది పైలట్లం ఏకతాటి పైన ఉన్నామని తెలిపారు. తమ రెండు డిమాండ్లు నెరవేర్చలేదన్నారు. ఒకటి తమ వేతనాలు చెల్లించడం, రెండు.. సంస్థ గట్టెక్కేందుకు సరైన రోడ్ మ్యాప్ కావాలన్నారు. ఈ డిమాండ్లు నెరవేరకుంటే విమానాలు ఆపేస్తామన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications