చైనా ఉత్పత్తుల ద్వారా పాక్ ఉగ్రవాదులకు నిధులు
పాక్ ఉగ్రవాదంపై ఇండియా యుద్దం చేస్తోంటే,.మరోవైపు పాకిస్తాన్ కు చైనా మోరల్ సపోర్ట్ తో పాటు ఆర్దికంగా కూడ సహకరిస్తుంది.. నిధులను నేరుగా కాకుండా చైనా ఉత్పత్తుల ద్వార పాక్ ఉగ్రవాదులకు నిధులు అందేలా చూస్తోంది..
ఈనేఫథ్యంంలోనే చైనీస్ ఉత్పత్తులు భారత దేశంలోకి హావాల మార్గంలో ప్రవేశిస్తున్నాయని ట్రేడర్స్ బాడీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆరోపిస్తోంది. అక్రమ ఉత్పత్తుల ద్వార వచ్చిన నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని చోబుతోంది..దీంతో పాటు ఆక్రమ మార్గంలో వస్తున్న ఉత్పత్తుల వల్ల కూడ భారత ఖాజానాకు భారి రెవెన్యు లోటు వస్తుందని పేర్కోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం చాల సిరియస్ గా తీసుకోవాలని సిఎఐటి విజ్ఝప్తి చేసింది. చైనా దిగుమతులపై ఉక్కుపాదం మోపేందుుకు ఇండియన్ పోర్ట్ ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని కోరుతోంది.
కాగా చైనా నుండి దిగుమతయ్యె వస్తువులను ఇన్ వాయిస్లో తక్కువ చూపించి, ఉగ్రవాదానికి నిధులు అందిస్తున్నాయని సిఏఐటి ఆరోపించింది. తక్కువ దిగుమతి సుంకం , తక్కువ జీఎస్టి వర్తించేలా వచ్చే చాల కేసుల్లో , దిగుమతి చేసుకున్న అసలుతో మెటిరియల్ సరిపోలడం లేదని సిఏఐటి చెబుతోంది.దీంతో చైనా నుండి దిగుమతి చేైసుకునే వస్తువుల్లో మెటిరియల్ తోపాటు డాక్యుమెంట్ల పరీశీలనను చేపట్టాల్సి ఉందని వారు కోరుతున్నారు.