రబ్బరు ఉత్పత్తిలో తరుగుదల టైట్ ఇండస్ట్ర్రీలో ఆందోళన
సహజ రబ్బరు ఉత్పత్తి లో ప్రస్థుతానికి తగ్గుముఖం పట్టింది,ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా ఉండడంతో రబ్బరు పరిశ్రమలో ఆందోళన వ్యక్తం అవుతోంది.రబ్బరు ఉత్పత్తిలో తరుగుదల టైట్ ఇండస్ట్ర్రీలో ఆందోళన దేశంలో సహజ రబ్బరు ఉత్పత్తి తగ్గుతోంది.. ఉత్పత్తిలో తగ్గుదల టైర్ ఇండస్ట్ర్రీలోఆందోళన కల్గిస్తోంది.దీంతో ముడి సరుకుల లభ్యతను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రిత్వ శాఖకు రబ్బరు పరిశ్రమ విజ్ఝప్తి చేసింది.కాగా సహజ రబ్బరు వినియోగం 12% పెరిగింది, ఇందుకు విరుద్దంగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి కాలానికి ఉత్పత్తి 7% పడిపోయిందని ఆటోమెటివ్ టైర్ మాన్యూఫక్ఛరింగ్ అసోసియోషన్ తెలిపింది. [ఏటిఎమ్ఏ]
సన్ షైన్ ఆసుపత్రి వాటాలను కోనుగోలు చేయనున్న కిమ్స్
ఉత్పత్తిలో తేడాలు
గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరి కాలానికి రబ్బరు ఉత్పత్తి వినియోగం 3.16 లక్షల టన్నులుండగా , ఈ ఆర్థిక సంవత్సరం 4.63 లక్షల టన్నులకు పెరిగింది.ఈనేపథ్యంలోనే రబ్బరు బోర్డు వివరాల ప్రకారం దేశీయంగా రబ్బరు వినియోగం ఎప్రిల్ జనవరి మాసాల్లో 10.2 లక్షల టన్నులు పెరగగా ఉత్పత్తి మాత్రం 5.6 లక్షల టన్నులు మాత్రమే ఉంది.
గతంతో పోల్చితే 30 శాతం రబ్బరు దిగుమతి పెరిగింది
గత ఆర్ధిక సంవత్సరంలో పది నెలల్లోనే పది లక్షల టన్నుల రబ్బరు వినియోగం పెరిగిందని .కాని ఇందులో 55శాతం మాత్రమే దేశంలో ఉత్నత్తి అవుతోందని చెప్పారు ఏటిఎమ్ఏ డైరక్టర్ జనరల్ రాజీవ్ భరద్వాజ్ తెలిపారు..దీంతో గత సంవత్సరం కంటే ముప్పై శాతం అధికంగా ఇతర దేశాల నుండి రబ్బరు దిగుమతులు అవుతున్నాయని ఆయన చెప్పారు.
వాతవరణం వెడెక్కడం మూలంగా ఉత్పత్తిలో మార్పలు
ఇక రబ్బరు బోర్డు వివరాల ప్రకారం గత సంవత్సరం జనవరిలో రబ్బరు ఉత్పత్తి 73వేల టన్నులు ఉండగా ఈ జనవరిలో 72 వేల టన్నులుగా ఉంది.మరోవైపు గత సంవత్సరం జనవరిలో దీని వినియోగం 99 టన్నులు ఉండగా 2019 జనవరిలో 97 వేల టన్నులు ఉంది.అయితే ఎండల తీవ్రత ,వేడివల్ల రబ్బరు ఉత్పత్తి తగ్గిపోయింది..అయితే ఇది తగ్గుదల పట్టిన అనంతరం రబ్బరు ఉత్పత్తిలో పెరుగుదల కన్పించనుందని బోర్డులోని అధికారులు తెలుపుతున్నారు.