ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహానాల విక్రయాలు మందగించాయి.కస్టమర్లు వీటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని .డిలర్లు చెబుతున్నారు..గత ఏడాది ఫిబ్రవరి మొత్తం వాహానాల 15,79,349 యూనిట్టు విక్రయాలు జరగగా ,ఈ ఫిబ్రవరి లో 8 శాతం క్షీణించి,14,52,078 యూనిట్లకు తగ్గాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ ఆసోసియోషన్ తెలిపింది. కాగ గత ఏడాది ఫిబ్రవరిలో 2,34,632 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ సంవత్సరంలో 2,15, 276 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
ఇక ద్విచక్ర వాహానాలు సైతం ఇదే స్థాయిలో ఉన్నాయి..గత సంవత్సరం 12,15,276 యూనిట్లు అమ్మకాలు జరగగా ఈ ఫిబ్రవరి 11,25,405 యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. కాగా ఏడాది చివరి లో నిల్వలను వదిలించుకునేందుకు ఆఫర్లు ప్రకటించడంతో పాటు కోత్త మోడళ్లు రావడంతో జనవరి లో ప్యాసింజర్ వాహనాలు పుంజుకున్నాయి అయితే ఫిబ్రవరి లో మాత్రం మందగించాయి.కాగా దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద వాహానాల నిల్వలు అధికంగా ఉన్నాయని తెలిపారు.

దీంతోపాటు కనీసం వందరోజుల పాటు విక్రచించేందుకు సరిపడ నిల్వలు డీలర్ల వద్ద ఉన్నాయని ఆసోసియోషన్ తెలిపింది. కాగా రానున్న రెండు నెలల్లో వాహనాలను ఎలాగైన క్లియర్ చేసైుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వారు వారు తెలిపారు.
కార్ల అమ్మకాలు సైతం తగ్గాయి..


Click it and Unblock the Notifications