ప్రైవేట్ సంస్థలు ఆధార్ డాటాను ఉపయోగించుకుంటే ఇక నుండి చార్జీలు చెల్లించాలి..ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసిన యూఐడిఏ , ప్రతి వెరీఫికేషన్ కు 20 రుపాయాలు చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కోన్నారు.

ప్రైవేటు సంస్థలు ఆధార్ వాడుకున్నంధుకు చార్జీలు చెల్లించాలి,
అన్నింటికి ఆధార్ ,ఆధార్ లేకుండా ఏ ఒక్క పని కావడంలేదు, ఆర్ధిక లావాదేవిలతో పాటు కనీస గుర్తింపు కార్డుగా ఆధార్ పనిచేస్తుంది. దీంతో ప్రతి ప్రైవేట్ సంస్థ తమ కార్యకాలపాలకు ఆధార్ ను అడుగుతున్నారు..సెక్యురిటి పరంగా అన్నింటికి ఆధార్ ను ఉపయోగిస్తున్నారు..సాధారణంగా మొబైల్ ఫోన్ కంపనీలయితే ఆధార్ లేకుండా కనెక్షన్ ఇవ్వడం లేదు.. ఇంత పెద్ద అవససరం ఉన్న ఆధార్ డాటాను యూఐడిఏ ఆదాయ వనరుగా మార్చుకోనుంది..

ప్రతి వెరిఫికేషన్ కు రూ.20
ఈనేపథ్యంలోనే తమ ఆధార్ సర్వీసులను వాడుకున్నందుకు గాను వ్యాపార సంస్థలు ఫీజులు చెల్లించాలని యూఐడిఏ ప్రకటించింది.ప్రతి కస్టమర్ వెరిఫికేషన్ కు ఆయా వ్యాపార సంస్థలు రూ.20 చెల్లించాలని ,ప్రతి ధ్రువీకరణ సర్వీసు వాడుకున్నందుకు 50 పైసలు చెల్లించాలని యూఐడిఏ తన నోటిఫికేషన్ లో పేర్కోంది. ఆధార్ రెగ్యులేషన్ 2019 కింద ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపింది.

కొన్నింటీకి మినహయింపు
అయితే ఈ చార్జీల నుండి ప్రభుత్వ సంస్థలను, పోస్టల్ డిపార్ట్మెంట్ తో కమర్షీయల్ బ్యాంకులను మినహయించింది

ఎందుకు చార్జీలు
పేపర్ ,ఫిజికల్ వెరిఫికేషన్ వంటి వాటితో పోలిస్తే ప్రస్తుతం చేపడుతున్న ఆధార్ తో కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వార సంస్థలకు పెద్ద ఎత్తున ఖర్చులు మిగులుతున్నాయి. దీంతోపాటు ఆధార్ ధ్రువీకరణ కేవైసీ సర్వీసులు ,కస్టమర్లతోపాటు సంస్థలకు ఈజిగా ఉంటున్నాయి. దీంతో ఆధార్ ఆధారిత ధ్రువీకరణ వాడుకునే అవకాశం ఇవ్వాలని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని ఆధికారిక వర్గాలు చెప్పాయి.నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత ఇన్ వాయిస్ జారీ చేసిన తర్వాత 15 రోజుల్లో ఈ లావాదీవీల ఛార్జీలను సంస్థలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పేమేంట్ 15 రోజులకు మించి ఆలస్యమైతే నెలకు 1.5 శాతం వడ్డీ చెల్లించాలి. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి ఆధార్ ధ్రువీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తే ప్రవేట్ సంస్థలు డబ్బులు చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కోంది..

ఆధార్ చార్జీలు కంపనీలు చెల్లిస్తాయా లేక వినియోగదారులా..
సాధరణంగా ఏ సంస్థలు కూడ లాభాపేక్ష లేకుండా వ్యాపారాన్ని కొనసాగించవు, ఈనేపథ్యంలోనే ప్రవైట్ సంస్థలకు సర్వీసు అందించడం ఎంత అవసరం ఉందో అంతే అవసరం వినియోగదారికి కూడ ఉంటుంది..దీంతో మన గుర్తింపు కోసం మనమే డబ్బులు చెల్లించాలా లేక సర్వీసు అందిస్తున్న సంస్థలు చెల్లిస్తాయో వేచి చూడాలి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications