కేదార్‌నాధ్ గుడి కమిటీలో అనంత్ అంబానీ

ప్రముఖ శైవ క్షేత్రమైన కేదార్‌నాధ్ గుడిలోని కమిటీలో ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీని సభ్యుడిగా నియమిస్తూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ నిర్ణయం తీసుకున్నారు. తరచూ ఈ గుడిని సందర్శిస్తూ.. ఆలయ బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నేపధ్యంలో రావత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అంబానీ కుటుంబ సభ్యులతో సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ప్రముఖ శైవక్షేత్రాన్ని సందర్శించిన ప్రతీసారీ తమ కుటుంబంలో ఏదో ఒక మంచి జరుగుతుందని ముకేష్ అంబానీ సభ్యులు భావిస్తూ ఉంటారు. అందుకే ఎవరో ఒకరు ఎప్పుడూ ఈ దేవాలయాన్ని వచ్చి ఆ పరమ శివుడి ఆశీస్సులూ పొందుతూ ఉండడం పరిపాటి.

Mukesh Ambani son anant ambani inducted as member in kedarnath temple committee

ఇషా అంబానీ పెళ్లి నేపధ్యంలో గతేడాది కేదార్‌నాధ్ సందర్శించిన అంబానీ కుటుంబం అక్కడి పండితుల ఆశీస్సులు పొందారు.

ఉత్తరాఖండ్‌లోని మందాకినీ నది మధ్య హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ కేదార్‌నాధ్ గుడి కొలువై ఉంది. అయితే ఎప్పుడు ఇక్కడ వాతావరణ పరిస్థితులు మారుతాయో చెప్పడం కష్టం. అందుకే ఈ గుడి సందర్శన చాలా కష్టసాధ్యమైంది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య మాత్రమే భక్తులకు ఈ ఆలయ సందర్శన భాగ్యం ఉంటుంది. మిగిలిన సమయాల్లో మంచు కారణంగా ఈ ఆలయ దరిదాపుల్లోకి వెళ్లడం కూడా కష్టంగా ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+