2020 కల్లా దేశంలో మరిన్ని జన ఔషది స్టోర్స్

ప్రతి సంవత్సంర మార్చి ఏడున జన ఔషది దివస్ గా నిర్వహిస్తామని కేంద్ర కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శాఖ సహయ మంత్రి మాందవియా అన్నారు.. జన ఔషధి కేంద్రాల్లో మందులు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 15 లక్షల మంది ఈ కేంద్రాల్లో మందులు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దాదాపు 800 రకాల ఔషధాలు, శస్త్రచికిత్సలకు ఉపయోగించే అన్ని రకాల పరికరాలు ఈ కేంద్రాల్లో లభ్యమవుతాయన్నారు. ఈనేపథ్యంలోనే వచ్చే సంవత్సరం నాటికి దేశంలో మరో 2500 జన ఔషది స్టోర్లను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది..కాగా దేశ వ్యాప్తంగా 5000 జన ఔషది స్టోర్స్ ఉన్నాయి..

Govt plans to open 2,500 more Jan Aushadhi stores by 2020

ఈనేపథ్యంలోనే వీటిని ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం కింద ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు.కాగా ప్రజలందరికి అందుబాటులో ఉండే విధంగా అన్ని చోట్ల స్టోర్లను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ప్రజలంతా వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. వీటిలో అన్ని రకాల మందులు అత్యంత తక్కువ ధరకు లభిస్తాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి తమ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. వచ్చే ఆదాయంలో దాదాపు 70 శాతం మందులకే ఖర్చయిపోతున్న నేపథ్యంలో, ప్రజలందరికీ మందులు అందుబాటు ధరలో ఉంచుతున్నామన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+