స్విఫ్ట్ నిబంధనలు పాటించని బ్యాంకులపై 11 కోట్ల రూపాయల జరిమానా విధించిన, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్విఫ్ట్ నిబంధనలు పాటించని నాలుగు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11 కోట్ల రూపాయల జరిమానా విధించింది జరిమానా విధించిన బ్యాంకుల్లో కరూర్ వైశ్య బ్యాంకు , కర్ణాటక బ్యాంక్ ,ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులతో పాటు యునైటెట్ బ్యాంక్ లు ఉన్నాయి,కాగా కర్ణాటక బ్యాంకు పై నాలుగు కోట్లు జరిమాన విధించగా మిగిలిన మూడు బ్యాంకులకు ఒక్కోక్కంటికి మూడు కోట్ల రుపాయాల జరిమాన విధించాయి..
కాగా విధించిన జరిమానను పద్నాలుగు రోజుల్లోపు డిపాజిట్ చేయాలని ఆర్బిఐ ఆదేశించింది,కాగా స్విఫ్ట్ అనేది బ్యాంకుల అంతర్గత నియంత్రణ, బలోపేతానికి చర్యలు తీసుకోవడంతోపాటు , ఆర్థిక లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్త, ఈ నేఫథ్యంలోనే స్విఫ్ట్ నిబంధనలు ఫాలో కాకపోవడంతో జరిమానా విధించినట్లు ఆర్బిఐ తెలిపింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకు 14 వేల కోట్ల కుంభకోణం స్విఫ్ట్ ను దుర్వినియోగం చేయడం మూలంగా జరిగిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి పటిష్ట చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది.