For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి.

పెట్రోల్,డీజిల్ ధరలు మంగళవారం (ఫిబ్రవరి 5) పెరిగాయి.పెట్రోలు పై ధర 7 పైసలు అలాగే డీజిల్ దేశంలోని ప్రధాన నగరాల్లో 10-11 పైసలు పెరిగింది.

By bharath
|

న్యూఢిల్లీ: పెట్రోల్,డీజిల్ ధరలు మంగళవారం (ఫిబ్రవరి 5) పెరిగాయి.పెట్రోలు పై ధర 7 పైసలు అలాగే డీజిల్ దేశంలోని ప్రధాన నగరాల్లో 10-11 పైసలు పెరిగింది. సోమవారం పెట్రోల్ ధర రూ.72.24 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర 67.64 రూపాయలకు పెరిగింది.

పెట్రోల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి.

కోల్కతాలో రిటైల్ పెట్రోలు ధర 7 పైసలు పెరిగి రూ .74.33 కు పెరిగింది. డీజిల్ ధరలు కూడా లీటరుకు 10 పైసలు పెరిగి రూ .69.33 చొప్పున పెరిగింది. అదేవిధంగా ముంబయిలో పెట్రోలు లీటరుకు సోమవారం రూ.77.80 రూపాయల నుండి పెరిగి రూ.77.87 కు చేరుకుంది.అదేవిదంగా డీజిల్ రూ.70.76 రూపాయల నుండి 10 పైసలు పెరిగి రూ.70.86 రూపాయల వద్ద నిలిచింది.

సోమవారం నాటి ధర నుండి 7 పైసలు పెరిగిన తరువాత చెన్నైలో పెట్రోలు లీటరుకు రూ.75.02 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మరియు డీజిల్ పై 11 పైసలు పెరిగిన తరువాత రూ. 71.49 రూపాయలుగా ఉంది.

దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేటుపై ఆధారపడుతుందని పేర్కొంది.

అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు మంగళవారం పడిపోయాయి. దీంతో ఇంధన డిమాండ్ పెరుగుదలకు సానుకూల అవకాశాలున్నాయి. అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 65.36 డాలర్లు, 31 సెంట్లు లేదా 0.5 శాతం వాటాను గత దగ్గరి నుంచి విక్రయించాయి.

Read more about: petrol diesel
English summary

పెట్రోల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. | Petrol,Diesel Become Costlier On Tuesday.

New Delhi: Petrol and diesel prices rose again on Tuesday (5 February) with a hike of 7 paise in petrol prices while diesel was raised by 10-11 paise across major cities of the country.
Story first published: Tuesday, March 5, 2019, 13:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X