రానుంది ఎలక్ట్ర్ర్రిక్ వాహానాల కాలమేనా ..అవే మన ప్రయాణంలో కీలక పాత్ర పోషించనున్నాయా.. ఈవీలు వినియోగానికి ముందుకు రావాలంటే ఈ రిక్షాలను ముందుగా మార్కేట్ లోకి తీసుకురావాలా.. అందుకే ప్రభుత్వం ఈ రిక్షాల తయారీ ప్రోత్సహిస్తుందా అంటే అవునని చెబుతున్నాయి పలు నివేదికలు...
ఎలక్ట్ర్ర్రిక్ వాహానల వినియోగం పెంచడంలో విద్యుత్ త్రీ వీలర్లు కీలక పాత్ర పోషించనున్నట్టు డెలాయిట్ తాజా నివేదిక చెబుతోంది. ప్రభుత్వం యొక్క పర్పస్ తీరాలంటే ఎక్కువగా ఈ రిక్షాల తయారి మేలని చెబుతుంది..ఈ రిక్షాలు పట్టణ ప్రాంతాల్లో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ వరకు కనెక్టివిటిని కలిగి ఉంటాయని నివేదిక పేర్కోంది.కాగా విద్యుత్ వాహానాలు ఇండియాలో విజయవంతం కావాలంటే వాటికి అనుకూలమైన వాతవరణాన్ని ఏర్పాటు చేసే భాద్యత ప్రభుత్వానిదని తెలిపింది.వీటికి సంబందించి రిస్కులు పడాల్సిన అవసరం లేదని పేర్కోంది.అయితే ఈ-రిక్షాలు విజయవంతం కావాలంటే ప్రభుత్వం, వాహన, బ్యాటరీల తయారీదారులు, ప్రైవేటు ఆపరేటర్లు అందరూ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంటుందని పేర్కోంది.
ఈ వాహనాల కొనుగోళ్లు, వినియోగం, పర్యవేక్షణ, నియంత్రణవంటివి ప్రభావవంతంగా ఉండేలా వ్యాపార నమూనాలు ఉండాలని పేర్కొంది. ఇలా ఉంటేనే నగరాల్లో విద్యుత్ వాహనాల వినియోగం పెరిగేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. విద్యుత్ వాహనాల వినియోగం పెరగడంతో ప్రభుత్వ పాత్ర చాలా ముఖ్యమని నియంత్రణా విధానం తీసుకురావడంలోనే కాకుండా బ్యాటరీల వ్యయం తగ్గడంలో, చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వ మద్దతు అవసరం ఉంటుందని పేర్కొంది.

విద్యుత్ వాహనాలకు ఫేమ్-2 దన్ను
ఫేమ్-2 పథకం కింద రూ.10,000 కోట్లు ప్రకటించిన నేపథ్యంలో మరిన్ని విద్యుత్ వాహనాలు విడుదల చేయడానికి మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్యాసెంజర్ వాహన విభాగంలో ఈ2ఓప్లస్, ఈవెరిటో పేర్లతో విద్యుత్ వాహనాలను విక్రయిస్తోంది. ఈ కంపెనీ రూ.100 కోట్ల పెట్టుబడితో బెంగళూరులో ఎలక్ర్టిక్ టెక్నాలజీ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ను ఏర్పాటు చేసింది. ఎలక్ర్టిక్ వాహనాల సంఖ్యను పెంచే చర్యల్లో భాగంగా చకన్ (పుణే)లోని ప్లాంట్ను రూ.450 కోట్ల పెట్టుబడితో విస్తరిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications