పెట్రోల్ ధరలు:ప్రధాన నగరాల్లో పెరిగిన ధరలు ఈవిదంగా ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మార్చి 2, మరోసారి పెరిగాయి. న్యూఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై వంటి నాలుగు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు రోజు వారి సవరణలతో కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మార్చి 2, మరోసారి పెరిగాయి. న్యూఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై వంటి నాలుగు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు రోజు వారి సవరణలతో కొనసాగుతున్నాయి. ఢిల్లీ-నేషనల్ కాపిటల్ రీజియన్ (గురుగ్రామ్) లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు 23 పైసలు తగ్గించాయి. న్యూఢిల్లీలో పెట్రోల్ ధర శుక్రవారం రూ.71.81 రూపాయల నుండి 13 పైసలు పెరిగి శనివారం రూ. 71.94 రూపాయలకు చేరింది, ముంబయి, కోల్కతాల్లో కూడా పెట్రోలు ధరలు 13 పైసలు పెరిగాయి.
ముంబయిలో మార్చి 2 వ తేదీన లీటరుకు లీటరుకు పెట్రోలు 77.57 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం ధర లీటర్ రూ.77.44 రూపాయలు.కోల్కతా లో పెట్రోలు ధర లీటరుకు 13 పైసలు పెరిగి 74.03 పైసలకు చేరింది శుక్రవారం ధర రూ.73.90 రూపాయల వద్ద ఉంది. మార్చి 2, 2019 న చెన్నైలో పెట్రోలు ధరలు 14 పైసలు పెరిగి రూ.74.57 రూపాయలకు పెరిగాయి.
శనివారం గురుగ్రం లో పెట్రోల్ ధర 71.89 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం నాడు లీటరుకు 72.12 రూపాయల నుంచి పె 23 పైసలు తగ్గింది అలాగే నోయిడా లో పెట్రోల్ 26 పైసలు పెరిగి రూ.71.50 రూపాయల నుంచి రూ.71.76 కి చేరుకున్నాయి.
అదేవిధంగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, నోయిడాలలో డీజిల్ ధరలు పెరిగాయి. గురూగ్రాంలో డీజిల్ ధరలు 20 పైసలు పడిపోయాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాల్లో డీజిల్కు రూ.67.27 రూపాయలు, రూ .70.47, రూ. 71.09, రూ .69.07 చొప్పున రిటైలింగ్ అయ్యాయి. నోయిడాలో డీజిల్ లీటరుకు రూ. 66.49 వద్ద ఉంది.