సెబీ చర్యలు భేష్ .. ఆర్థికమంత్రి జైట్లీ ప్రశంసలు
న్యూఢిల్లీ : సెబీ తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కితాబిచ్చారు. బడ్జెట్ తర్వాత మార్కెట్ నియంత్రణాధికార సంస్థ (సెబీ) ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించడం సాధారణం. ఇటీవల సెబీ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ ప్రసంసించారు జైట్లీ
నిబంధనల సరళీకరణ
స్టాక్ మార్కెట్ లో నమోదు కావాలని భావిస్తోన్న అంకురాలకు ప్రోత్సహాన్నివ్వాలని సెబీ భావించింది. అందులోభాగంగా అంకురాల్లో పెట్టుబడులు పెట్టే పెట్టుబడుదార్ల గుర్తింపు నిబంధనలను సరళీకరించడానికి సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. అంకురాల నమోదుకు ఉద్దేశించిన ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్ ఫాం నుంచి గుర్తింపు పొందే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు, అర్షత, ఇతర నిబంధనలను సెబీ త్వరలో నోటీఫై చేస్తోంది.
చార్జీల తగ్గింపుతో రిలీఫ్
బ్రోకర్లకు, స్టాక్ ఎక్సేంజీలు, నమోదయ్యే కంపెనీలకు ఛార్జీలను తగ్గించడానికి సెబీ బోర్డు అనుమతిచ్చింది. అదే సమయంలో రుణ పునర్నిర్మాణాన్ని ఎదుర్కొంటున్న కంపెనీలకు నిబంధనలను సరళీకరించడానికి అంగీకరించింది. ఎంపికచేసిన కంపెనీలకు ఓపెన్ ఆఫర్ తప్పనిసరి అనే నిబంధనను తొలగించింది.
నమోదు నిబంధనల సరళీకరణ
స్థిరాస్తి, మౌలిక పెట్టుబడుల ట్రస్టుల నమోదుకు నిబంధనల సరళీకరణకు ఆమోదం తెలిపింది. కస్టోడియన్లు, సెబీ నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ ను పొందే వెసులుబాటును కల్పించింది.
ఫండ్ లకు కమోడిటీ డెరివేటిట్ మార్కెట్ లో పర్మిషన్
కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ ను మరింత విసృతం చేసేందు కోసం మ్యూచువల్ ఫండ్, ఫోర్ట్ పోలియో మేనేజర్లకు అనుమతినిచ్చింది. ఇప్పటికే కొన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్ లకూ కమోడిటీ డెరివేటివ్స్ లో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే తాజాగా వాటికి కాంట్రాక్టుల భౌతిక సెటిల్ మెంట్ కు బదులుగా వస్తువుల డెలివరీ తీసుకునేందుకు సెబీ అనుమతులిచ్చింది.