పెట్రోల్ ధరలు:బుధవారం ప్రధాన నగరాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి.
నేడు పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు,వరుసగా ఆరు రోజులు పెరిగిన పెట్రోల్ ధరలు బుధవారం ఎటువంటి మార్పు లేదని మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: నేడు పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు,వరుసగా ఆరు రోజులు పెరిగిన పెట్రోల్ ధరలు బుధవారం ఎటువంటి మార్పు లేదని మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.డీజిల్ ధరలు కూడా పెద్ద నగరాల్లో మారలేదు. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.71.66 రూపాయలు, డీజిల్కు రూ.66.92 రూపాయల చొప్పున విక్రయిస్తోంది. మంగళవారం ధరతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు.
మంగళవారం రిటైల్ ఇంధన ధరలు పెరిగాయని, దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోలు పై 9 పైసలు,డీజిల్ ధర లీటరుకు 12-13 పైసలు పెరిగింది.
ముంబైలో పెట్రోలు లీటర్ కు రూ.73.76 రూపాయలు చెల్లించగా, డీజిల్ రూ .68.71 చొప్పున ధర ఉన్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్ సైట్ లో లభించిన సమాచారం ప్రకారం.
అదేవిధంగా ముంబయిలో లీటరు పెట్రోలు రూ.77.29 రూపాయలు, డీజిల్కు రూ.70.10 రూపాయలు, మంగళవారం ధరతో పోలిస్తే ఎటువంటి మార్పు లేదు. చెన్నైలో పెట్రోలు లీటరు రూ.74.41 రూపాయలు, డీజిల్ ధర రూ .70.72 రూపాయల వద్ద ఉంది.
నోయిడాలో పెట్రోలు ధర రూ.71.30 రూపాయలు, డీజిల్ ధర రూ .65.96 వద్ద ఉంది. గురుగ్రాంలో పెట్రోలు, డీజెల్ ధరలు వరుసగా రూ.72.04 రూపాయలు,రూ.66.29 రూపాయల వద్ద స్థిరంగా ఉన్నాయి.
రోజువారీ డైనమిక్ ధరల పాలన కారణంగా, రిటైల్ ఇంధన ధరలు 15 రోజుల సగటున అంతర్జాతీయ ముడి ధరలపై ఆధారపడతాయని అదేవిదంగా రూపాయి-అమెరికా డాలర్ మారకం రేటు పై కూడా ఆధారపడి ఉంటుంది.భరత్ లో ముడి అవసరాలలో 80 శాతం దిగుమతి చేసుకుంటున్నది.
బుధవారం, అంతర్జాతీయ చమురు మార్కెట్లో, OPEC- నేతృత్వంలోని సరఫరా తగ్గింపుల తరువాత ముడి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 65.55 డాలర్లు, వాటి చివరి ముగింపులో 34 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగాయి.