పేటిఎం, ఫోన్ పే సంస్థలకు మరో 6 నెలల గడువు - ఆర్బీఐ

ఈ-వాలెట్ సంస్థలకు ఆర్బీఐ నిర్ణయం ఊరటనిచ్చింది. ప్రీపెయిడ్ యూజర్లు ఖచ్చితంగా నో యువర్ కస్టమర్ (కెవైసీ) నిబంధనలను పాటించాలని గతంలో ఆర్బీఐ వెల్లడించింది. ఇందుకోసం ఫిబ్రవరి 28వ తేదీని డెడ్ లైన్‌గా విధించింది. అయితే దీన్ని మరో 6 నెలల పాటు పొడిగించబోతున్నట్టు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది.

ఆధార్ ఈ-కెవైసీ నిబంధనలు విషయంలో ఆలస్యమవుతోందని, ఇందుకోసం మరింత సమయం కావాలని ఈ రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలు కోరిన నేపధ్యంలో గడువు పొడిగించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనతో తెలిపింది. ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ వినియోగిస్తున్న వారికి కెవైసీ పూర్తి చేసేందుకు మరో 6 నెలల గడువును ఇచ్చినట్టు వెల్లడించింది.

Big relief to e-wallet companies from kyc

ప్రస్తుతం పేటిఎం, అమెజాన్ పే, ఫోన్ పే, మొబిక్విక్ వంటి సంస్థలు ఈ-వాలెట్ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. గత కొన్ని రోజుల ఈ డెడ్ లైన్ నేపధ్యంలో వాళ్లలో కంగారు ఎక్కువైంది. థర్ట్ పార్టీ సంస్థలను ఏర్పాటు చేసుకుని మరీ నో యువర్ క్లైంట్ నిబంధనలకు అనుగుణంగా వాటిని పూర్తిచేస్తూ వస్తున్నారు. తాజాగా ఆర్బీఐ ఇచ్చిన ఊరట నేపధ్యంలో అటు ఈవాలెట్ సంస్థలు, ఇటు కస్టమర్లు కాస్తంత ఊపిరి పీల్చుకోవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+