మరోసారి పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు ఈవిదంగా ఉన్నాయి.
ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు సోమవారం రిటైల్ ఇంధన ధరలను మరోసారి పెంచాయి. పెట్రోలు పై 14-16 పెరగగా, డీజెల్ ధరలు 15-17 పైసలు పెరిగాయి.
న్యూఢిల్లీ: ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు సోమవారం రిటైల్ ఇంధన ధరలను మరోసారి పెంచాయి. పెట్రోలు పై 14-16 పెరగగా, డీజెల్ ధరలు 15-17 పైసలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు ధర రూ.71.57 రూపాయలకు పెరిగింది. ఆదివారం నాడు ధరలు రూ.71.42 రూపాయలుగా నమోదయ్యాయి. డీజిల్ ధర రూ.66.80 రూపాయలకు పెరిగింది.
కోల్కతాలో లీటర్ పెట్రోలు కు రూ.73.67 రూపాయలు చెల్లించాల్సి ఉంది. కోల్కతాలో లీటరు డీజిల్ రూ. 68.59 రూపాయలు నిన్నటి ధర రూ.68.43 రూపాయలగా నమోదయ్యాయి.
ముంబైలో రిటైల్ పెట్రోలు ధర 14 పైసలు పెరిగి రూ.72.20 కి చేరుకుంది. డీజిల్ ధర లీటరుపై 17 పైసలు పెరిగి రూ .69.80 రూపాయలకు చేరుకుంది. చెన్నైలో పెట్రోలు లీటరు రూ.74.32 రూపాయలు, డీజిల్ ధర పై 17 పైసలు పెరిగి రూ.70.59 రూపాయలకు చేరుకుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ నుంచి ఈ సమాచారం వెల్లడైంది.
భారతదేశంలో రిటైల్ పెట్రోల్ మరియు డీజిల్ అంతర్జాతీయ చమురు ధర మరియు రూపాయి-డాలర్ మారకం రేటు రెండింటిపై ఆధారపడివుంటుంది. ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరలు అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కన్నా అత్యంత చవకగా ఉన్నాయి.
అంతర్జాతీయ చమురు మార్కెట్లో సోమవారం ముడి చమురు ధరలు పెరిగాయి. అమెరికా-చైనా ట్రేడింగ్ ఒప్పందంలో పురోభివృద్ధి సాధ్యమవుతుందని అంచనా వేసింది. గత సెషన్లో అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ గత ముగింపులో 67.26 డాలర్లు, 14 సెంట్లు లేదా 0.2 శాతం పెరిగాయి.