దేశభక్తి, తో వ్యాపారం.....వినియోగదారులను అకర్షించే నినాదాలు...
కూటి కోసం కోటి తిప్పలు ..అన్నారు పెద్దలు అదే సామేతను అక్షరాల ఫాలో చేశాడు ఢిల్లిలోని ఓ షూ అమ్ముకునే ఓ వ్యాపారీ ....దీంతో అతను అనుకున్నట్టుగానే వ్వాపారం బాగా కొనసాగింది.. ఇంతకి అతను ఏం చేశాడు ..
ఇటివల పుల్వామా దాడిని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు..ఎవ్వరికి తోచిన రీతిలో వారు దాడిని ఖండిస్తున్నారు..ఇక షోషల్ మీడియాలోనైతే దేశభక్తి కాముకులు సైనికులకు మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు..ఇక శత్రుదేశం పాకిస్తాన్ పై ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు..ఈనేపథ్యంలోనే ఇదే వైఖరిని ఢిల్లిలోని ఓ చెప్పుల వ్యాపారి అనుసరించారు...తనకున్న దేశ భక్తిని శత్రుదేశం పై ఉన్న వ్యతిరేకతను తన వ్యాపారం లో చూపించారు...
షూ చేతపట్టుకుని రోడ్డుపై నిలబడి పాకిస్తాన్ ముర్ధాబాద్ అంటూనే తన షాపులో మూడు జతల షూ కేవలం 1100 రుపాయాలంటూ నినదించారు..దీంతో అతను అనుకున్నట్టుగానే వినియోగదార్లను తనషాపు వైపు తిప్పుకున్నారు..పనిలో పనిగా తన దేశ భక్తిని చాటుకున్నారు...దీంతో ఇది చూసిన ఢిల్లికి చెందిన ఓ కవి ఇమ్రాన్ ప్రతాప్ గిరి తన ట్విట్టర్ వీడియో పోస్ట్ చేశారు...అతని దేశభక్తి ఈ విధంగా అమ్ముకున్నాడంటూ ఆయన పోస్ట్ చేశాడు.