వరుసగా ఆరవ రోజు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు?
ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ పెట్రోల్ ధరలు మంగళవారం వరుసగా ఆరవరోజు పెంచేసాయి.నేడు రేటు సవరణ తరువాత, పెట్రోల్ పై 9-11 పైసలు పెరిగి, డీజిల్ ధర లీటరుకు 6-7 పైసలు పెంచింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ పెట్రోల్ ధరలు మంగళవారం వరుసగా ఆరవరోజు పెంచేసాయి.నేడు రేటు సవరణ తరువాత, పెట్రోల్ పై 9-11 పైసలు పెరిగి, డీజిల్ ధర లీటరుకు 6-7 పైసలు పెంచింది. ఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర రూ.71 రూపాయలకు పెరిగింది. సోమవారం రూ. 70.91 గా ఉండగా, డీజిల్ ధర రూ.66.11 రూపాయలకు పెరిగింది.
చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ.73.72 రూపాయలు చెల్లించాల్సి ఉంది. సోమవారం రేటు కంటే 11 పైసలు ఎక్కువ. డీజిల్ లీటరు చెన్నైలో రూ.69.91 రూపాయలు, నిన్న రేటు రూ.69.84 రూపాయలకంటే 7 పైసలు పెరిగింది.
కోల్కతాలో రిటైల్ పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి రూ.73.11 రూపాయలకు చేరింది. డీజిల్ ధరలు 6 పైసలు పెరగడంతో రూ .67.89 రూపాయల చొప్పున పెరిగింది. ముంబైలో లీటరు పెట్రోలు రూ.76.54 రూపాయల చొప్పున 76.64 రూపాయలు చేరింది, డీజిల్ లీటర్ కు రూ .69.30 చొప్పున విక్రయిస్తోంది. నిన్నటి ధర రూ. 69.23 తో పోల్చి చూస్తే 7 పైసలు ఎక్కువగా ఉంది.
నోయిడాలో పెట్రోల్ రూ.70.78 రూపాయల వద్ద రిటైలింగ్ సోమవారం 70.71 రూపాయల వద్ద ఉన్నటు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ లో తెలిపింది. గురుగ్రం లో పెట్రోల్ పై 5 పైసలు పెరిగి రూ.71.65 రూపాయల వద్ద నిలిచింది.
ఈ ఏడాది ఇప్పటివరకూ పెట్రోలు ధరలు ఢిల్లీ, ముంబయిలో లీటరుకు సుమారు రూ.2.05 రూపాయలు మరియు రూ.2.2 రూపాయలు పెరిగాయి అలాగే డీజిల్ ధరలు కూడా రూ.3.25 రూపాయలు మరియు రూ.3.47 రూపాయల చొప్పున పెరిగాయి.
అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు మంగళవారం నాడు పడిపోయాయి.అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 66.08 డాలర్లు, 42 సెంట్లు, లేదా 0.6 శాతం వాటాలు చివరిసారిగా అమ్ముడయ్యాయి.