రిలయన్స్ అడాగ్ కు ఊరట...
హైద్రబాద్...అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపునకు ఊరట లభించింది.తనఖా పెట్టిన షేర్లను విక్రయించకుండా రుణదాతలతో అనిల్ అంబానీ గ్రూప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.తనఖాలో ఉన్న షేర్లను అమ్మకుండా 90 శాతం రుణదాతలు ఒప్పందాన్ని అంగీకరించాయి...కొత్త ఒప్పదం ప్రకారం షేరు ధర పడిపోయి, తనఖా విలువ తగ్గినా వీటిని విక్రయించకూడదు.
దీనికి ప్రతిగా అడాగ్ రుణదాతల అసలు, వడ్డీతో సహా ఒప్పందంలో పేర్కొన్న తేదీ నాటికి చెల్లిస్తుంది.కాగా ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకున్న అనిల్ అంబానీ గ్రూప్ షేర్లు నష్టాల మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏకంగా 12 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 12 శాతం, రిలయన్స్ కేపిటల్ దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ పవర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రిలయన్స్ నిప్పన్ లైఫ్ సైతం లాభాల బాటపట్టడం విశేషం.