ఈ కామర్స్ వ్యాపారం లోకి నేరుగా ఐటిసి కంపనీ....
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో స్వదేశి సంస్థలు ఈ కామర్స్ వ్యాపారం లోకి అడుగుపెడుతున్నాయి..ఇందులో భాగంగానే ఆన్ లైన్ వ్యాపారంలోకి స్వంతంగా రానుంది ఐటిసి కంపనీ..ఇప్పటికే పలు ఐటిసి ఉత్పత్తులనున ఫ్లిప్ కార్డ్,అమోజాన్ లలో ఉంచిన ఐటిసి తానే స్వయంగా ఈ కామర్స్ వ్యాపారంలోకి రానుంది.ఈనేపథ్యంలోనే ఐటిసిస్టోర్.ఇన్ త్వరలో ప్రారంభం కానుంది..అయితే దీని సర్వీసులు కేవలం మెట్రో నగరాలకు మాత్రమే అందింంచనుంది..ఇందుకోసం లాజిస్టిక్స్ కంపనీలతో ఒప్పందాలను కుదర్చుకుంటుంది..
కాగా స్టేషనరీ అమ్మకాల కోసం ప్రత్యేక ఈ కామర్స్ సేవలను అందించనున్న ఐటిసి చర్మరక్షణ ఉత్పత్తులు,ఆశీర్వాద్ పిండి,నెయ్యి,బియ్యం,ప్రోటిన్ బిస్కట్స్ వంటి వస్తువులను ఈ కామర్స్ ద్వార అమ్మేం దుకు సిద్దమవుతోంది..కాగా డయబెటిస్ కోసం తాయరు చేసిన రాగి పండి లాంటి వాటిని కూడా తన స్టోర్ లో అమ్మనుంది..మరో వైపు 2030 నాటికి ప్యాకేజ్డ్ ఫుడ్ ,స్టేషనరీ ,పర్సనల్ కేర్ లాంటి వాటిల్లో సుమారు లక్ష కోట్ల ఆదాయం సంపాదించడమే లక్ష్యంగా పావులు కదుపనుంది...