వరుసగా రెండవ రోజు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.
శుక్రవారం వరుసగా రెండో రోజు రిటైల్ ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 7-8 పైసలు పెరిగి, డీజిల్ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో లీటరుకు 6-7 పైసలు పెరిగాయి.
న్యూఢిల్లీ: శుక్రవారం వరుసగా రెండో రోజు రిటైల్ ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 7-8 పైసలు పెరిగి, డీజిల్ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో లీటరుకు 6-7 పైసలు పెరిగాయి.శుక్రవారం గురువారం పెట్రోలు ధర రూ.70.46 రూపాయలకు పెరిగింది గురువారం ధర రూ.70.39 రూపాయలుగా ఉంది.శుక్రవారం డీజిల్ ధర 65.67 రూపాయలకు పెరిగింది.
అన్ని మెట్రో నగరాల్లో కన్నా ఇంధన ధరలు ఢిల్లీ లో తక్కువగా ఉన్నాయి దీనికి కారణం తక్కువ పన్నులు ఉండటం.
కోల్కతాలో పెట్రోలు పై 7 పైసలు పెరిగి రూ.72.57 రూపాయలకు చేరింది. డీజిల్ పై 6 పైసలు పెరిగి రూ. 67.51 రూపాలకు పెరిగింది.ముంబయిలో లీటరు పెట్రోలు రూ.76.10 రూపాయల వద్ద నిలిచింది. డీజిల్ లీటరుకు రూ .68.83 చొప్పున ఉంది.
చెన్నైలో లో పెట్రోల్ పై 8 పైసలు పెరిగి రూ.76.14 రూపాయలకు చేరింది.డీజిల్ పై 7 పైసలు పెరిగి రూ.69.44 వద్ద నిలిచింది.
అయితే, నోయిడాలో పెట్రోలు రూ.70.35 రూపాయలు, గురుగ్రాంలో రూ.71.31 రూపాయలు, నిన్నటి ధరలతో పోల్చితే 5 పైసలు పెరిగింది.డీజిల్ నోయిడాలో లీటర్కు రూ. 64.94, గురుగ్రాంలో రూ.65.47 రూపాయలు ఉంది.
భారతదేశంలో రిటైల్ ఇంధన ధరలు ప్రపంచ చమురు ధర మరియు రూపాయి-డాలర్ మారకం రేటు రెండింటిపై ఆధారపడి ఉంటాయి.
OPEC, అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ గత సెషన్లో 65 డాలర్లకు చేరింది. గత ముగింపులో 0.5 శాతం పెరిగింది.