ఇండిగో విమాన టిక్కెట్లపై మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.
దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్ల పై ఇండిగో కేవలం రూ. 899 మరియు రూ. 3,399 రూపాయల పరిమిత కాల ఆఫర్ ప్రకటించింది.ఇండిగో విమాన టిక్కెట్లపై ఆఫర్ ఫిబ్రవరి 13, 2019 వరకు అందుబాటులో ఉంటుందని
దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్ల పై ఇండిగో కేవలం రూ. 899 మరియు రూ. 3,399 రూపాయల పరిమిత కాల ఆఫర్ ప్రకటించింది.ఇండిగో విమాన టిక్కెట్లపై ఆఫర్ ఫిబ్రవరి 13, 2019 వరకు అందుబాటులో ఉంటుందని మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్ లో తెలిపింది. ఈ ఆఫర్ కింద్ బుకింగ్ చేసుకున్న వారు ఫిబ్రవరి 26 ,2019 నుండి సెప్టెంబర్ 28 2019 మధ్య ప్రయాణం చెల్లుబాటులో ఉంటుంది. అమెరికన్ ఎక్స్ప్రెస్, RBL బ్యాంక్ లేదా డిజి బ్యాంక్ (DBS) కార్డులతో టిక్కెట్లు కొనుగోలు చేస్తే ఇండిగో అదనపు 20 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది.

అయితే, డిస్కౌంట్ ఆఫర్ పొందేందుకు, నిష్క్రమణ తేదీ ముందు కనీసం 15 రోజుల ముందు టిక్కెట్లు బుక్ చేసి ఉండాలి.
ఢిల్లీ-అహ్మదాబాద్ మార్గంలో రూ. 1,999. ఢిల్లీ నుండి బాగ్డోగ్రా కు టికెట్ ధర రూ.2,699 రూపాయలు.
డిస్కౌంట్ ఆఫర్ ఏ ఇతర ఆఫర్ తో కలిపి ఉండకూడదు మరియు గ్రూప్ బుకింగ్ కు వర్తించదు అని ఇండిగో తెలిపింది.
ఇండిగో నెట్వర్క్ అంతటా వివిధ రంగాల్లో నాన్-స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ చెల్లుతుంది అని క్యారియర్ పేర్కొంది.
ప్రయాణీకులను ఆకర్షించేందుకు ఎయిర్లైన్స్ డిస్కౌంట్ ఆఫర్లు మరియు కొత్త మార్గాలను రోజువారీకి అందిస్తోంది. దేశ పౌరవిమాన విభాగంలో అధిక పోటీలో భాగంగా ఇండిగో ఎయిర్లైన్స్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలే,ఇండిగో దాని 16 వ అంతర్జాతీయ గమ్యంగా ఇస్తాంబుల్ను ప్రకటించింది. మార్చి 20, 2019 నుండి ఢిల్లీ-ఇస్తాంబుల్ మధ్య రోజువారీ విమాన సర్వీసులు నడుపుతాయి.
గత వారంలో హైదరాబాద్, సౌదీ అరేబియా జెడ్డా మధ్య రోజువారీ విమాన సర్వీసులు మార్చి 25 నుంచి ప్రారంభించనున్నట్లు స్పైస్జెట్ తెలిపింది.
కన్నూర్-అబూ ధాబీ-కన్నూర్ మార్గంలో 2019 మార్చి నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు గోఏర్ తెలిపింది.


Click it and Unblock the Notifications