For Quick Alerts
For Daily Alerts
స్వల్పంగా పెరిగిన రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు
|
న్యూఢిల్లీ: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే ఎంతో మందికి మక్కువ. అన్ని ద్విచక్ర వాహనాలకు ఇది భిన్నం. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలపై ధరలు స్వల్పంగా పెంచారు. పెంచిన ధరలు ఈ నెలలోనే అమలులోకి రానున్నాయి.
350సీసీ -500 సీసీ మధ్య మోడళ్ల పైన రూ.1500 వరకు ధరలు పెంచింది. బుల్లెట్ 350, 500, క్లాసిక్ 350, 500 , హిమాలయన్ మోడళ్ల పైన ధరల్ని పెంచింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.
ఈ పెరిగిన ధరల ప్రకారం బుల్లెట్ 350 ధర రూ.1.34 లక్షల నుంచి ప్రారంభం కానుంది. క్లాసిక్ 350 ఏబీఎస్ సిగ్నల్స్ ఎడిషన్ ధర పెరిగి రూ.1.63లక్షలకు చేరుకుంది. హిమాలయన్ ఏబీఎస్ ఎడిషన్ 1.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఉత్పత్తి వ్యయాలు పెరగటమే ధరల స్వల్ప పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
Comments
English summary
స్వల్పంగా పెరిగిన రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు | Royal Enfield raises price of 350-500cc offerings: Report
Story first published: Thursday, February 7, 2019, 18:26 [IST]