ఫిబ్రవరి 18వ తేదీన ఆర్బీఐ బోర్డు మీటింగ్
ముంబై: ఆర్బీఐలో తొలిసారి అర్ధ సంవత్సరానికి ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఆడిట్ బోర్డు కమిటీ దీనిని చేపట్టింది. భవిష్యత్తులోనూ ఇలాగే అర్ధ సంవత్సర ఆడిట్లను కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి తొమ్మిదో తేదీన జరగాల్సిన పోస్ట్ బడ్జెట్ సమావేశాన్ని 18వ తేదీకి వాయిదా వేశారు.
ఈ సమావేంలో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. ఆర్బీఐ గత డిసెంబర్ నెలలో బిమల్ జలాన్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆర్బీఐ వద్ద ఎంత వరకు మిగులు నిధులను ఉంచుకోవచ్చో ఈ కమిటీ లెక్క కడుతుంది. ఈ నివేదిక ఏప్రిల్లో అందుతుంది.
మరోవైపు, ఆర్బీఐ ఆడిట్ వేగంగా జరుగుతోంది. అర్ధ సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదిక త్వరలో బ్యాంక్ బోర్డు ముందుకు రానుంది. ఇది అందగానే ఆర్బీఐ ప్రభుత్వానికి అందజేయాల్సిన మధ్యంతర డివిడెండ్ను నిర్ణయిస్తారు. 2018 జులై నుంచి డిసెంబర్ మధ్య కాలానికి బ్యాంకు లెక్కలను గణిస్తున్నారు.