బడ్జెట్ ప్రభావంతో తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు.
ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా వంటి నగరాల్లో ఫిబ్రవరి 2, 2019 శనివారం పెట్రోల్, డీజెల్ ధరలు పడిపోయాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా వంటి నగరాల్లో ఫిబ్రవరి 2, 2019 శనివారం పెట్రోల్, డీజెల్ ధరలు పడిపోయాయి. లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు ప్యాకేజీ ,పెన్షనర్లకు, పూర్తి ఆదాయపు పన్ను రూ .5 లక్షల వరకు ఆర్జించే వారికి రిబేటు, బ్యాంకులు మరియు పోస్ట్ కార్యాలయాల్లో డిపాజిట్లపై టిడిఎస్ మినహాయింపును పెంచింది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు గత రెండు రోజులుగా నిరంతరాయంగా తగ్గుతున్నాయి.
ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 70.94 రూపాయల నుండి రూ. 70.84 కు తగ్గించింది. ముంబయిలో శుక్రవారం పెట్రోలు 76.57 రూపాయల నుండి నేడు రూ.76.47 రూపాయల వద్ద రిటైల్ అయ్యింది. చెన్నై, కోల్కతాల్లో పెట్రోలు ధరలపై 10 పైసలు తగ్గాయి. కోల్కతాలో పెట్రోలు ధరలు లీటరుకు 73.04 రూపాయల నుంచి రూ.72.94 రూపాయలకు చేరింది.చెన్నైలో పెట్రోలు ధరలు శుక్రవారం రూ.73.64 రూపాయల నుండి రూ.73.54 రూపాయలకు పడిపోయింది.
ఇదిలా ఉండగా గురుగ్రం లో పెట్రోల్ ధర లీటరుకు 2 పైసలు పెరిగి 71.57 రూపాయలకు పెరిగింది.శుక్రవారం ధరలు రూ.71.55 రూపాయలుగా ఉంది.
మరోవైపు, మెట్రో నగరాల్లో న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలలో డీజిల్ ధరలు మారలేదు. న్యూఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నైలలో డీజిల్ లైసెల్ కు రూ.65.71, రూ .68.81, రూ. 67.49 మరియు రూ.69.41.ఆసక్తికరంగా గురుగ్రం లో శుక్రవారం డీజిల్ ధరలు లీటరుకు రూ .65.52 రూపాయల నుంచి 10 పైసల చొప్పున తగ్గి రూ.65.42 రూపాయలకు చేరుకున్నాయి.