For Quick Alerts
For Daily Alerts
డాలర్తో 29 పైసలు తగ్గి71.39 వద్ద నిలిచిన రూపాయి
|
ముంబై: మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో రూపాయి విలువ పతనమైంది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయ్యాకా నిలకడగా ఉన్న రూపాయి విలువ ఆ తర్వాత ఇరవై తొమ్మిది పైసలు పతనమైంది. దీంతో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.71.37కు చేరుకుంది.
మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం, ముడి చమురు ధరలు పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిలిచాయి. బడ్జెట్లో భారీ పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందనే అంచనాలతో రూపాయి బలహీనపడింది.
గురువారం రూపాయి డాలర్తో పోలిస్తే నాలుగు పైసలు బలపడి రూ.71.08 వద్ద ముగిసింది. గురువారం మార్కెట్లలో ఎఫ్ఐఐలు భారీ ఎత్తున కొనుగోళ్లు జరిపారు. రూ.3వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లు జరిపారు.
Comments
English summary
డాలర్తో 29 పైసలు తగ్గి71.39 వద్ద నిలిచిన రూపాయి | Rupee slips 29 paise to 71.37 per dollar
Story first published: Friday, February 1, 2019, 19:49 [IST]