హైవేల అభివృద్ధిలో భారత్ ప్రపంచంలోనే ముందుంది..గ్రామీణ రహదారులకు రూ.19వేల కోట్లు

ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయుష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అభివృద్ధిలో భారత దేశం దూసుకెళుతోందని చెప్పారు. ప్రపంచంలోనే హైవేల నిర్మాణం భారత్‌లో అత్యంత వేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. రోజుకు 27 కిలోమీటర్ల మేరా హైవేల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. హైవేల నిర్మాణం వాటి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న పీయుష్ గోయల్...గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం రూ.19వేల కోట్లు కేటాయించడం జరిగింది.

ఇక గత నాలుగేళ్లలో 51,073 కిలోమీటర్లు నిర్మాణం కోసం భూసేకరణ జరిగిందని ఇప్పటికే 28వేల531 కిలోమీటర్లు మేరా హైవేల నిర్మాణం జరిగిందని కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం రోజుకు 28 కిలోమీటర్ల మేరా పనులు జరుగుతున్నాయని ఇక వేగాన్ని పెంచి రోజుకు 40 కిలోమీటర్ల మేరా రహదారుల నిర్మాణం చేపడుతామని చెప్పారు.

 India Fastest Highway Developer in the World, Rs 19000 Cr Allocated for Rural Roads

దేశంలోని రహదారులకు సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు భూమిరాశి పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించామని చెప్పారు గడ్కరీ. ఇందులో భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల దగ్గరనుంచి కేంద్ర ప్రభుత్వం ఆమోదం వరకు అన్ని అంశాలను పొందుపరుస్తున్నామని చెప్పారు గడ్కరీ. భూసేకరణ విషయం పలు అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో పారదర్శకత కోసమే ఈ పోర్టల్ ప్రారంభించినట్లు గడ్కరీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తోందని చెప్పారు. దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. ఉదాహరణకు ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేకు లక్ష కోట్లు ఖర్చు కాగా.. కొత్త అలైన్ మెంట్‌తో రూ. 16,500 కోట్లు ఆదా అయ్యిందని చెప్పారు. భూసేకరణ జరగడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+