తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు,ప్రముఖ నగరాల్లో ధరలు పరిశీలించండి.
గురువారం దేశవ్యాప్తంగా రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ పై 10 పైసలు తగ్గింది మరియు డీజిల్ రేట్లు 8 నుంచి 9 పైసలు పడిపోయాయి.
న్యూఢిల్లీ:గురువారం దేశవ్యాప్తంగా రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ పై 10 పైసలు తగ్గింది మరియు డీజిల్ రేట్లు 8 నుంచి 9 పైసలు పడిపోయాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో పెట్రోలు రూ.71.019 రూపాయల నుంచి 10 పైసలు తగ్గి రూ. 71.09 రూపాయలుగా నమోదైంది, డీజిల్ రూ.65.81 రూపాయల వద్ద ఉంది.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం ముంబయిలో పెట్రోలు, డీజిల్ ధర రూ. 76.72, రూ.68.91 రూపాయల ధర ఉంది. చెన్నై లో పెట్రోలు లీటర్ కు రూ.73.80 రూపాయలు చెల్లించగా, డీజిల్ లీటరుకు రూ. 69.52 వద్ద ఉంది. కోల్కతాలో పెట్రోలు రూ.73.18 రూపాయలు,డీజిల్ రూ.67.59 రూపాయలుగా ఉన్నాయి.
నోయిడాలో లీటరు పెట్రోల్ పై 8 పైసలు తగ్గడంతో ధర రూ. 70.82 వద్ద ఉంది.డీజిల్ పై 7 పైసలు తగ్గడం తో లీటరు రూ.64.98 రూపాయల వద్ద ఉంది.గురుగ్రం లో నేడు దరల సవరణ తరువాత పెట్రోల్ ధర రూ. 71.85 వద్ద విక్రయించబడుతోంది. మరియు డీజిల్ లీటరుకు రూ .65.60 విక్రయించబడుతోంది.
గత ఏడాది అక్టోబర్ లో పెట్రోలు ధర ఢిల్లీలో లీటరుకు 84 రూపాయలు, ముంబయిలో రూ.91.34 రూపాయలకు పెరగడం గమనార్హం. జాతీయ రాజధానిలో డీజిల్ రూ.75.45 రూపాయలు,ముంబై లో రూ .80.10 రూపాయల ధర తాకింది.
ఇంతలో, అంతర్జాతీయ ముడి చమురు ధరలు గురువారం పెరిగాయి, అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 62.17 డాలర్లు, 52 సెంట్లు లేదా 0.8 శాతం లాభాలతో ముగిశాయి.