జియో యూజర్లకు మరో గుడ్ న్యూస్! ఏంటో మీరే చూడండి
గత కొన్ని సంవత్సరాలు నుంచి ఇండియాలో టెలికాం రంగంలో ఒక సంచలనం సృష్టించింది రిలయన్స్ జియో. ఈరోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర జియో ఫోన్ జియో సిమ్ ఖచ్చింతంగా ఉంటుంది.
ముకేశ్ అంబానీ:
ఇక జియో ఇంతగా విజయం సాధించడానికి కారణం ముకేశ్ అంబానీ జియో వినియోగదారులకి ఇచ్చిన ఆఫర్లు మాత్రమే ముందు మార్కెట్లో ఉంది 3G నెట్ వర్క్ మాత్రమే ఇక ఈ నెట్ స్పీడ్ తో పని చేయడం చాలా కష్టంగా ఉండేది కానీ జియో వచ్చిన తర్వాత ఒక్క ఇంటర్ నెట్ మాత్రమే కాదు అవుట్ గోయింగ్ కాల్స్ ఫ్రీ, మెసేజీలు ఇలా అన్ని ఉచితంగా ఇచ్చింది.
టెలికాం కంపెనీలు:
ఇక మిగతా టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకి ఏదో ఒక ఆఫర్లు ఇస్తుంటాయి కానీ ఆఫర్లు ఇవ్వడం విషయంలో జియో ఒక సపరేట్ స్టైల్ ప్రతి పండుగకి ప్రతి వేడుకకి తమ వినియోగదారులకి ఎన్నో బంపర్ ఆఫర్లు ఇస్తుంది.
తాజగా:
తాజగా మరో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిలో రూ.594 ప్లాన్ కింద రోజుకు అర జిబి డాటా, 300 ఎస్ఎంఎస్లు 28 రోజులు లభించనున్నాయి. ఈ ప్లాన్ వ్యాలీడిటీ 168 రోజులుగా నిర్ణయించింది జియో. అలాగే 84 రోజుల కాలపరిమితి కలిగిన రూ.297 ప్లాన్ కింద రోజుకు 0.5 జిబి డాటాతోపాటు నెలకు 300 ఎస్ఎంఎస్లు అందిస్తోంది. డాటా ముగిసిన తర్వాత వేగం 64 కెపికి పడిపోనుందని రిలయన్స్ జియో సంస్థ వెల్లడించింది
జియో పుట్టుక:
అలాంటి జియో పుట్టుకకు అసలు కారణం తన కుమార్తె ఇషా అంబానీ అని అంటున్నాడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.ఈ మధ్య డ్రైవర్స్ అఫ్ చేంజ్ అనే అవార్డు అందుకున్న సంధర్బంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. అయన మాటలతో చెప్పాలి అంటే నిజానికి జియో ఆలోచన 2011 లో నా కుమార్తె ద్వారా వచ్చింది.
జియో ప్రారంభం:
సెప్టెంబర్ 2016 లో జియోని ప్రారంభించాం ఇప్పటికే భారత్ లో ఒక గొప్ప మార్పుగ అవతరించింది.అమెరికా 1G మొబైల్ నెట్ వర్క్ ,ఆరోఫ 2G , చైనా 3G తో ముందు అడుగు వేయగా JIO 4G ప్రపంచంలోనే అతి పెద్దగా మారింది.2019 లో 5G ని భారత్ లో అగ్రగామిగా నిలపెడతాం.
అందుకే జియో టాప్:
భారత వ్యాప్తంగా 2G నెట్వర్క్ తీసుకురావడానికి 25 ఏళ్ళు పట్టింది.కానీ JIO కేవలం 3 ఏళ్ళు పట్టింది. 5G కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది అని JIO ఆలోచన ఎప్పుడు ఎలా వచ్చిందో వివరించాడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.