సత్య నాదెళ్ల గారిని కలిసిన మెగా కోడలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సీఈఓ సత్య నాదెండ్ల గారిని కలిశారు.ఈ విషయం స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కోడలైన ఉపాసన గారు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇక అందరికి తెలిసిన విషయం ఉపాసన గారు అపోలో ఆసుపత్రి సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారి మనవరాలు అనిల్ మరియు శోభన దంపతుల యొక్క పెద్ద కుమార్తె వీరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, లీజర్ అండ్ హెల్త్ కేర్ వంటి వ్యాపారాలు ఉన్నాయి.ఇందులో ఉపాసన గారు ఆరోగ్య విభాగాన్ని అలాగే ఆరోగ్యం తో పాటు ఫిట్ గా ఎలా ఉండాలి అని బోధిస్తుంటారు.
స్టీవ్ బాల్మెర్ తరువాత మైక్రోసాఫ్ట్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా 2014 లో సత్య నాదెళ్ల గారు మైక్రో సాఫ్ట్ కంపెనీ సీఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఈయన కుటుంబ నేపధ్య ప్రకారం వీరు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు కానీ ఈయన జన్మస్థలం తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్. 1992 లో మైక్రోసాఫ్ట్ లో చేరడానికి ముందు తన టెక్నాలజీ సిబ్బందిలో సన్ మైక్రోసిస్టమ్స్ లో పనిచేశారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు తన ట్విట్టర్ ద్వారా సత్య నాదెళ్ల గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది అని ఇక ముందు నుంచి అపోలో మరియు మైక్రో సాఫ్ట్ రెండు కలిసి పని చేస్తే ఇంకా ఆధునిక ఆరోగ్య పధ్దతులు తీసుకోని రావచ్చు అని ఆమె అభిప్రాయపడ్డారు.