గూగుల్ కు రూ. 405 కోట్ల జరిమానా... ఎందుకో తెలుసా?
రూల్స్ పాటించకపోతే ఎంతటి వాడికైనా దెబ్బ తప్పదు అని ఫ్రాన్స్ ప్రభుత్వం నిరూపించింది. ఇక ఈరోజుల్లో మనకు ఏమి కావాలన్నా జై గూగుల్ అని అంటాము అలాంటి టెక్ అధిపతి గూగుల్ పై ఫ్రాన్స్ ప్రభుత్వం జరిమానా వేసింది ఎందుకో చూద్దాం.
జనరల్ డేటా ప్రొటెక్షన్ రేగులేషన్ GDPR రూల్స్ పాటించనందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం గూగుల్ పై ఏకంగా రూ.405 కోట్లు జరిమానా వేసింది.ప్రకటనలకు తదితర వాటికీ గూగుల్ యూజర్ల వ్యక్తిగత డేటా గూగుల్ వాడుకుంటోంది.
అయితే దీని పై ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంది యూజర్ల అనుమతి లేకుండా వారి డేటా వాడకూడదు కానీ గూగుల్ యూజర్ల అనుమతి లేకుండా యూజర్ల డేటా వాడుకొంది. కానీ ఇక్కడ గూగుల్ కొంచెం తెలివిగా ప్రవర్తించింది.
అదిఎంటి అంటే యాడ్స్ వద్దు అనేందుకు యూజర్లు ఒక ఆప్షన్ ఎంచుకోవాలి దాని చేరుకొనే పక్రియను చాలా కష్టంగా పెట్టింది గూగుల్ కానీ దీని గుర్తించిన ఫ్రాన్స్ డేటా వాచ్ డాగ్ ప్రభుత్వానికి సమాచారం పంపింది ఇంకేముంది ఫ్రాన్స్ ప్రభుత్వం గూగుల్ పై భారీ జరిమానా విధించింది.