బిత్తరపోయిన సామాన్య యువకుడు?తన ఇంటి విద్యుత్ బిల్లు రూ.23 కోట్లు?
ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్లో ఒక వ్యక్తికి తన ఇంటి విద్యుత్ 2 కిలోవాట్లు కనెక్షన్ కోసం బిల్లు రూ.23 కోట్లు రావడం చూసి బిత్తరపోయాడు పాపం.
ఉత్తర్ ప్రదేశ్: ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్లో ఒక వ్యక్తికి తన ఇంటి విద్యుత్ 2 కిలోవాట్లు కనెక్షన్ కోసం బిల్లు రూ.23 కోట్లు రావడం చూసి బిత్తరపోయాడు పాపం.
సాధారణ విద్యుత్ కనెక్షన్ కింద ఉన్న ఇల్లు,178 యూనిట్ల విద్యుత్ను మాత్రమే వినియోగించింది అని బిల్లులో పేర్కొంది.
తన విద్యుత్ వినియోగానికి సంబంధించి వచ్చిన పెద్ద మొత్తం గురించి వివరాలు తెలుసుకునేందుకు అబ్దుల్ బేసిత్, ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ నివాసి సదరు విద్యుత్ శాఖను సంప్రదించాడు.
చార్జ్ చేయబడిన ఖచ్చితమైన మొత్తం రు. 23,67,71,524 రూపాయలు అని తెలిపాడు.
"నేను మొత్తం ఉత్తరప్రదేశ్ బిల్లును అందుకున్నట్లు అనిపిస్తోంది అని అబ్దుల్ బేసిత్ ANI కి చెప్పారు. "ఈ మొత్తం తన జీవితాంతం సంపాదించినా కూడా ఈ అన్యాయమైన మొత్తాన్ని చెల్లించలేనేమో" అని అతను చెప్పాడు.
దీనిపై ANI కార్యనిర్వాహక ఇంజనీర్ షాదాబ్ అహ్మద్ మాట్లాడుతూ బిల్లు సరిదిద్దుకున్న తర్వాత మాత్రమే చెల్లింపు చేయవచ్చు అని చెప్పారు.
"ఎటువంటి బిల్లులు కొన్ని సాంకేతిక లోపల వల్ల వస్తున్నాయని ఐతే మీటర్ రీడింగ్ మరోసారి తీసుకోని సవరిస్తామని ఆ తరువాతే బిల్లు చెల్లించాలని సూచించారు.