తెలంగాణ ప్రజలకు కెసిఆర్ హెచ్చరిక పాటించకపోతే జరిమానా తప్పదు
నగర వాసులకి తెలంగాణ ప్రభుత్వం మరో హెచ్చరిక తెలియజేసింది అసలు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఇలా చేస్తోంది అంటే ఇక పై రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తే మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
తెలంగాణ ప్రభుత్వం:
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేస్తోంది రోడ్ పై చెత్త పడేసేవారికి రూ.500 జరిమానా వేయనుంది షింక్ నుంచి మురికి నీరు రోడ్ పై వదిలిన త్రాగు నీరు కలుషితం చేసిన కూడా రూ.500 జరిమానా వేయనుంది.
బహిరంగ ప్రాంతాలలో:
ఇక బహిరంగ ప్రాంతాలలో ఇతరులకి ఇబ్బంది పెట్టినవారికీ రూ.1000 జరిమానా అలాగే గ్రామా పంచాయితుల స్థలాలు ఆక్రమిస్తే రూ.2000 జారినామకు గురవుతారు. ఈమేరకు పంచాయితీ రాజ్ చట్టం 2018 లో కఠిన నిబంధనలు వింధించారు.
అసెంబ్లీ లో:
స్థానిక సంస్థల ఎన్నికలు మరియు లోకసభ ఎన్నికలు ముగిశాక కొత్త పంచాయితీ రాజ్ చట్టాన్ని అమలు చేస్తాము అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ లో ప్రకటించారు. ప్రస్తుత పంచాయితులు అన్ని మురికి కూపాలలాగా ఉన్నాయి అని దీని మార్చేందుకు కొత్తగా నియమితులైన 9500 మంది జూనియర్ పంచాయితీ కార్యదర్శకులకి నిబంధనలు పక్కాగా అమలు చేయాలి అని అయన చెప్పారు.
ఎమ్మెల్యేలను:
ఒకవేళ మీరు నిబంధలను సరిగా పాటించకపోతే మూడు ఏళ్ళ ప్రొబిషరీ పీరియడ్ రేనివాల్ చేయబోము అని అయన చెప్పారు. ఇక ఈ నిబంధలను ప్రజలు అమలు చేసేలాగా ఎమ్మెల్యేలను తమ వంతు కర్తవ్యం చేయాలి అని కెసిఆర్ ఆదేశించారు. ఇక ఈ రూల్స్ ఎవరన్నా అతిక్రమిస్తే వారుఎవరైనా సరే తప్పించుకోలేరు అని అయన చెప్పారు.