వరుసగా ఆరవరోజు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.దేశవ్యాప్తంగా ధరలు ఈవిదంగా.
మంగళవారం నాడు వరుసగా ఆరవ రోజు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోలు పై 13-14 పైసలు పెరగగా, డీజిల్ పై ధర 19 నుంచి 21 పైసలు పెరిగింది.
న్యూఢిల్లీ: మంగళవారం నాడు వరుసగా ఆరవ రోజు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోలు పై 13-14 పైసలు పెరగగా, డీజిల్ పై ధర 19 నుంచి 21 పైసలు పెరిగింది. ఢిల్లీలో పెట్రోలు ధర సోమవారం రూ.71.14 రూపాయల నుంచి నేడు రూ.71.27 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర రూ.65.71 రూపాయలకు పెరిగింది.
కోల్కతాలో సోమవారం ధరతో పోల్చిచూస్తే 12 పైసలు పెరిగి పెట్రోలు లీటరుకు రూ.73.36 రూపాయలు చెల్లించాల్సి ఉంది అదేవిదంగా డీజిల్ నిన్నటి ధర రూ. 67.49 రూపాయల నుండి 19 పైసలు పెరిగి రూ.67.68 రూపాయలకు చేరుకుంది.
ముంబయిలో రిటైల్ పెట్రోలు ధర సోమవారం ధర తో పోల్చిచూస్తే 13 పైసలు పెరిగి రూ .76.98 కు చేరింది మరియు డీజిల్ ధర లీటరుకు రూ. 68.81 చొప్పున నిన్నటి ధరల నుంచి 20 పైసలు పెంచింది. చెన్నైలో పెట్రోలు రూ.73.99 రూపాయలు, సోమవారం ధర 73.85 గా ఉండగా 14 పైసలు పెరగగా డీజిల్ ధర 69.41 రూపాయల నుండి పెరిగి రూ .69.62 కు చేరుకున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ నుంచి ఈ సమాచారం వెల్లడైంది.
నోయిడాలో రిటైల్ పెట్రోల్ ధర 11 పైసలు పెరిగి రూ.70.97 కి చేరగా,డీజిల్ ధర రూ.65.06 రూపాయలుకు చేరింది. గురుగ్రాంలో పెట్రోలు, డీజిల్ ధర వరుసగా రూ .71.99, రూ .65.67 రూపాయలకు చేరింది.
అక్టోబర్ 4, 2018 న, పెట్రోలు ధర ఢిల్లీలో లీటరుకు 84 రూపాయలు మరియు ముంబైలో 91.34 రూపాయల రికార్డు ధర నమోదుచేశాయి.అదే సమయంలో డీజిల్ ధరలు ఢిల్లీలో రూ .75.45, ముంబైలో రూ. 80.10 రూపాయల ధరలు ఉన్నాయి.
అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు మంగళవారం పడిపోయాయి. ప్రపంచ ఆర్ధిక వృద్ధిపై ఆందోళనలు తలెత్తాయి. అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 62.64 డాలర్లు, 10 సెంట్లు లేదా 0.2 శాతం క్షీణించాయి.