జియో ని ఢీ కొట్టేకి BSNL భారీ ప్లాన్ ఏంటో చుడండి.
జియో వచ్చిన తర్వాత మొత్తం మన దేశం లో ఉన్న అన్ని టెలికాం సంస్థలు చాలా వెనుకంజలో ఉన్నాయి. దీనికి కారణం జియో ముకేశ్ అంబానీ తమ వినియోగదారులకి ఇస్తున్న ఆఫర్స్ మాత్రమే.
ఒక్కప్పుడు ఎయిర్ టెల్ మరియు బిఎస్ఎన్ఎల్ ఈ రెండు టెలికాం సంస్థలు మాత్రమే వినియోపగదారులకి అన్ని ఆఫర్లు ఇచ్చేవి కానీ జియో రాకతో మొత్తం టెలికాం కంపెనీలు రేసులో వెనుకపడ్డాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాము అని అనుకుంటారా? పాయింట్ కి వస్తే ఈ జియో ని ఎదురుకోవడానికి ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకి బంపర్ ఆఫర్లు ప్రకటించింది కానీ ఈ సేవలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వినియోగదారులకి మాత్రమే.
ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మరో ఆఫర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది 6 నెలల వ్యాలిడిటీతో రూ.899 విలువగల ప్లాన్ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. రోజుకు 1.5 GB ఇంటర్నెట్ డేటా చొప్పున మొత్తం 270 GB డేటా వినియోగదారులకు లభించనుంది. 1.5 GB డేటాతోపాటు ముంబై, ఢిల్లీ సర్కిళ్లకు తప్ప మిగతా అన్ని సర్కిళ్లలోని నెంబర్లకు అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు 50 ఎస్సెమ్మెస్లు లభించనున్నాయి.
గతంలోనూ రోజుకు 1.5 GB డేటాతో రూ.999 టారిఫ్ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. ఆ రీచార్జ్ వ్యాలిటినీ కేవలం 181 రోజులకే పరిమితం చేసింది. అయితే, ఈ ఆఫర్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిళ్లలోని వినియోగదారులకు అందుబాటులో ఉండగా, తాజాగా సోమవారం ప్రకటించిన రూ.899 ప్లాన్ మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లకే పరిమితం కానున్నట్టు బీఎస్ఎన్ఎల్ స్పష్టంచేసింది.
చూడాలి ఇకనైనా రిలయన్స్ జియో సంస్థని డి కొడతాయో లేదో మిగతా టెలికాం కంపెనీలు ఇక మీరు బిఎస్ఎన్ఎల్ వినియోగధారులైతే వెంటనే ఈ రీఛార్జ్ చేసుకోండి.