ఒక్క దెబ్బతో 480 కోట్లు... చరిత్ర తిరగ రాసిన పవన్ కళ్యాణ్ వాట్సాప్ లో వైరల్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మన తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా ఆయన ఏమి చేసిన ఒక ప్రభంజనమే.
అభిమానులు:
పవన్ కళ్యాణ్ అనే పేరు వినిపించిన చాలు అభిమానులు ఆనందంతో పులకరించి పోతారు. ఆయన ఏది చెప్తే అదే ఆదేశంగా భావిస్తారు ఆయన అభిమానులు. సాధారణంగా రాజకీయ పార్టీ సభలకు కోట్లు పెడితే కానీ జనాలు తరలి రారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక్క పిలుపునిస్తే లక్షలాది మంది ఆయన సభలకు, కవాతులకు హాజరు అవుతున్నారు
ప్రత్యేక ఆర్టికల్స్:
దీని గురించి అంతర్జాతీయ దిన పత్రికలు కూడా ప్రత్యేక ఆర్టికల్స్ రాసిన సంగతి మన అందరికి తెలిసిందే. అంతటి ఫాలోయింగ్ ఉన్న యంగ్ మాస్ లీడర్ మన ఇండియా లో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని అని చెప్పొచ్చు.
శ్రీ రెడ్డి - కత్తి మహేష్:
ఇది ఇలా ఉండగా గతం లో పవన్ కళ్యాణ్ గారి పై శ్రీ రెడ్డి, కత్తి మహేష్ లాంటి వారు తమ పాపులారిటీ కోసం టీవీ లైవ్ డిబేట్ షోలలో రెచ్చి పోయి పవన్ కళ్యాణ్ గారి పై నోరు పారేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. శ్రీ రెడ్డి అయితే నడి రోడ్డు మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారి అమ్మని దుర్భాషలాడారు. ఒక్కసారిగా అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది.
అన్నింటిని బ్యాన్:
తెలుగు దేశం పార్టీ కి చెందిన యెల్లో మీడియా అయితే పదే పదే ఈ అంశాల పైన చర్చలు జరిపి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మనసులని గాయపర్చింది. ఇది అంతా ఒక పక్కా ప్రణాళిక తో చేసారు అని గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు యెల్లో మీడియా పైన యుద్ధం ప్రకటించారు. తన తల్లిని దూషించిన ఈ చానెల్స్ అన్నింటినిబ్యాన్ చేయవల్సిందిగా అభిమానులకి అప్పట్లో పిలుపు నిచ్చారు పవన్ కళ్యాణ్ గారు.
BARC సంస్థ:
ఆ పిలుపు ఒక్క ప్రభంజనం లా మారింది. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి యెల్లో మీడియా చానెల్స్ అన్ని దారుణంగా నష్టపోయాయి. ఇటీవల BARC సంస్థ 2018 కి గాను ఒక రేపో రేటుని విడుదల చేస్తూ, టీవీ సంస్థల లాభ నష్టాలను ఒక నివేదిక గా ఇచ్చింది.
TRP పాయింట్స్:
ఇందులో అప్పట్లో 43 TRP పాయింట్స్ తో ముందుకి దూసుకు పోతూ నెంబర్ 1 స్థానం లో కొనసాగిన TV9 ఛానల్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు దెబ్బకి ఏకంగా 23 పాయింట్లకు పడిపోయింది. ఒక్క TV9 మాత్రమే కాకుండా మిగతా అన్ని యెల్లో మీడియా చానెల్స్ TRP రేటింగ్స్ దారుణంగా నష్టపోయాయి.
అసత్య ప్రచారాలు:
ఫలితంగా ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 480 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లినట్టు BAARC సంస్థ పేర్కొనింది. ఇది ఒక సంచలన విప్లవం అనే చెప్పొచ్చు. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారి పైన అసత్య ప్రచారాలు కాని, అర్థం పర్థం లేని లైవ్ డిబేట్లు కాని రన్ చెయ్యడం మానేశారు మన యెల్లో మీడియా. పవన్ కళ్యాణ్ గారి తో ఆయన అభిమానులతో పెట్టుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ ఈ ఆర్టికల్ వాట్సాప్ గ్రూప్స్ లో వైరల్ అవుతోంది మూలం:వాట్సాప్ గ్రూప్స్.