ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా రసావత్రంగా జరగనున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి. అయితే ఇంకా ఎన్నికలకు కొన్ని నెలలు ఉండడంతో రాజకీయ నాయకులు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు.

నారా చంద్రబాబు నాయుడు:
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓట్లర్లపై వరాల వర్షం కురిపిస్తున్నాడు. మొన్న సంక్రాంతి పండగకి పెన్షన్ రెట్టింపు చేశారు.ఇప్పుడు రైతు బంధు తరహా స్కిమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

భారీ సభలో:
తాజాగా అయన మహిళా ఓట్లపైన ద్రుష్టి పెట్టారు అందుకే ప్రతి డ్వాక్రా మహిళలకు అందరికి రూ.10 వేలు అందించాలి అని నిర్ణయించారు. అంతే కాకుండా ప్రతి డ్వాక్రా మహిళలకి ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వాలి అని నిర్ణనించుకున్నారు.దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నారు అని ఒక భారీ సభలో ఈ ప్రకటన ఇస్తారు అని సమాచారం.

జగన్:
ఇంతకుముందే వైస్ జగన్ నవరత్నాలు అని తాము అధికారంలోకి వస్తే చేసే పథకాలు ముందే ప్రకటించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆ నవరత్నాలలో ఒక్కొకటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ తాజా పథకం కూడా జగన్ ప్రకటించిన నవరత్నాలలో ఒకటిగా ఉంది అని అనుకుంటున్నారు.

ఆర్ధిక సహాయం:
వైస్ జగన్ కూడా డ్వాక్రా మహిళలకు ఆర్ధిక సహాయం చేస్తాను అని చెప్పాడు. గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు తమ రుణాలు మాఫీ చేస్తాము అని హామీ ఇచ్చిన అది పూర్తి స్థాయిలో కాలేదు.

మహిళల ఓట్లు :
మరి ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ మరియు రూ.10000 వేలు పథకం అమలు చేసి చూపితే మొత్తం మహిళల ఓట్లు అని తెలుగు దేశం పార్టీకి పడతాయా? ఏమో చూడాలి లేదా ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం అని వైస్ జగన్ పార్టీకి ఓటు వేస్తారో కొన్నినెలలలో
తేలిపోతుంది.


Click it and Unblock the Notifications