ఢిల్లీ: భారత దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందిన శతాబ్ధి ఎక్స్ప్రెస్కు చెక్ పెడుతూ కొత్తగా ఇంజిన్ రహిత రైలు ట్రైన్ 18ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ ఈ రైలును ఇతర దేశాల్లో కూడా ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సింగపూర్ కౌలాలంపూర్ మధ్య ఈ హైస్పీడ్ రైలును పరుగులు పెట్టించే దిశగా భారత ప్రభుత్వం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ట్రైన్ 18 పట్ల మిడిల్ ఈస్ట్ దేశాలు, దక్షిణ అమెరికా, పలు ఆసియా దేశాలు, యూరప్ దేశాలు ఆసక్తిని కనబర్చినట్లు రైల్వే బోర్డు అధికారి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. అంతేకాదు వివిధ దేశాల్లో పనిచేస్తున్న భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు అంతా ఒకరోజు సమావేశమైనప్పుడు ఈ ట్రైన్ గురించి ఆసక్తి విషయాలను ప్రెజెంటేషన్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్లు సమాచారం. తిరిగి ఆయాదేశాలకు అధికారులు వెళ్లినప్పుడు ట్రైన్ 18 యొక్క విశిష్టత గురించి అక్కడ వివరిస్తే ఆ దేశ ప్రభుత్వాలు రైలు కొనుగోలుకు ఆసక్తి కనబర్చే అవకాశం ఉందని మోడీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఆయాదేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతాయనే ఆలోచనలో ప్రధాని ఉన్నారు.

ఇతర దేశాల్లో తయారు అవుతున్న హైస్పీడు రైళ్ల ధరతో పోలిస్తే సాంకేతికంగానూ ఇటు ధర పరంగాను ట్రైన్ 18 బాగుందని రాజేష్ అగర్వాల్ తెలిపారు. అంతేకాదు ధర విషయానికొస్తే ఇతర దేశాల్లో తయారయ్యే హైస్పీడ్ రైళ్లతో పోలిస్తే భారత్లో తయారైన ట్రైన్ 18 ధర 25 శాతం తక్కువే ఉందని స్పష్టం చేశారు.అందుకే ప్రపంచ మార్కెట్లో తాము ప్రవేశించి ట్రైన్ 18 విశిష్టతను చాటాలని భావిస్తున్నట్లు రాజేష్ తెలిపారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు ముందుకేస్తోందని రాజేష్ అగర్వాల్ తెలిపారు.
2018లో సింగపూర్-కౌలాలంపూర్ రైల్వే ప్రాజెక్టును మలేషియా ప్రధాని మహతిర్ మొహ్మద్ తిరస్కరించారని ఆ తర్వాత ధరల విషయం చూసి తిరిగి మొగ్గు చూపారని అగర్వాల్ వెల్లడించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాలు ట్రైన్ 18పై ఆసక్తి కనబరుస్తున్నట్లు అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ వారణాసిల మధ్య ఈ హైస్పీడు ట్రైన్ పరుగులు తీయనుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు పరుగులు తీస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications