పెట్రోల్ ధరలపై 8 పైసలు పెరిగి అలాగే డీజిల్ పై 19-20 పైసలు పెరిగాయి.దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు జనవరి 18 న అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి.
పెట్రోల్ ధరలపై 8 పైసలు పెరిగి అలాగే డీజిల్ పై 19-20 పైసలు పెరిగాయి.దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు జనవరి 18 న అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి.

ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.71 రూపాయలకు దగ్గరగా ఉంది మరియు లీటరు డీజిల్ దాదాపు రూ .65 చొప్పున జాతీయ రాజధానిలో ధరలు నమోదయ్యాయి.
ముంబైలో పెట్రోలు ధర లీటర్ కు రూ.76.18 రూపాయల చొప్పున ఉంది. తాజాగా డీజిల్ ధర రూ. 68 గా నమోదైంది.
కోల్కతా లో (రూ .72.66 / లీటర్), చెన్నై (73.23 / లీటర్), గురుగ్రామ్ (71.24 / లీటర్), నోయిడా (రూ. 70.27 / లీటరు), బెంగళూరు (రూ .72.80 / లీటరు) హైదరాబాద్ (రూ .74.84 / లీటరు) చొప్పున ధరలు ఉన్నాయి.
పెట్రోలు ధరల పెంపుతో, కేవలం రెండు నగరాలు భువనేశ్వర్ (రూ .69.43 / లీటరు) మరియు చండీగఢ్ (రూ 66.72 / లీటర్) లో మాత్రమే లీటర్ కు రూ.70 మించి దాటలేదు.
ముంబైలో లీటరుకు రూ .68.02 చొప్పున మరియు డీజిల్ ధర రూ. 64.97 వద్ద రిటైలింగ్ అయ్యింది.
హైదరాబాద్ నగరంలో డీజిల్ ధర అత్యధికంగా (రూ. 70.62 / లీటరు)ధర ఉండగా భువనేశ్వర్ (69.52 / లీటర్), పాట్నా (రూ. 68.28 / లీటరు) మరియు త్రివేండ్రం లో (రూ .69.96 / లీటర్లు) ధరలు ఇంచుమించు ఓకే దగ్గర కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ విలువ రూపాయికి వ్యతిరేకంగా పెరగడం జనవరి 7 నుంచి ప్రతిరోజు పెంపుదల సంభవించింది.ఈ నెల ప్రారంభమైన నాటి నుండి దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు లీటరుకు దాదాపు 1.82 రూపాయల చొప్పున పెరిగాయి మరియు డీజిల్ పై లీటరుకు 2 రూపాయలకు పైగా పెరిగింది.
చమురు మార్కెట్ 2018 నాటికి దాదాపు 40 శాతం నష్టపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముడి చమురు ధరలు గత ఏడాది అక్టోబరులో సాగుతున్న స్థాయిల కంటే కనీసం 30 శాతం తక్కువగా కొనసాగుతున్నాయి.
అయితే, గత నాలుగు రోజుల్లో రూపాయి పతనం కావడం ప్రభుత్వానికి ఉన్న ప్రధాన చింతల్లో ఒకటి, ఫలితంగా ఇంధన ధరలు పెరగడం జరిగింది. 2019 నాటికి మొదటి 18 రోజుల్లో రూపాయి విలువ 2 శాతం పైగా క్షిణించింది.
పెట్రోల్, డీజిల్ ధరలు రెండు పెరగడం తో గత అక్టోబర్ 4 వరకు కొన్ని నెలల పాటు ఇంధన ధరలు పెరిగాయి పెరిగిన ధరలు పరిశీలించి చూస్తే పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.84 రూపాయలు తాకి, ముంబైలో రూ.91 రూపాయలకు పైన నమోదు అయింది. మరోవైపు, డీజిల్ ధర లీటరుకు రూ .80 దాటింది అలాగే డీజిల్ ధర లీటరుకు రూ.80 రూపాయలు దాటింది.
చమురు మార్కెట్లు 2019 నాటికి మరింత స్థిరంగా ఉండగలవని అంచనా వేయడంతో రూపాయి విలువలో తాజా తగ్గుదలతో పాటు, ఇంధన ధరలు భవిష్యత్తులో మరో పదునైన పెరుగుదలను చూడవచ్చంటున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications