టీ అమ్ముతూ 23 దేశాల పర్యటన ...భారత దేశ అపరకుభేరుడు.. టీ కొట్టు యాజమని
కలలను సహకారం చేసుకోవాలి అని అందరు అనుకుంటారు కానీ ఆ దిశగా నిరంతరం కష్టపడి విజయం సాధించేది కొందరే కేరళకి చెందిన ఈ దంపతులు కథ ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళకి చెందిన:
వీరు కేరళకి చెందిన విజయన్ దంపతులు తమ చిన్ననాటి కలను సహకారం చేసుకోవడం కోసం వీరు చేస్తున్న కృషిని చూసి మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర పొగిడారు. ప్రపంచ పర్యటన లక్ష్యంగా గత 55 ఏళ్లుగా టీ కొట్టు నిర్వహిస్తూ విదేశాలు చుట్టివచ్చిన ఈ 70 ఏళ్ల వృధా దంపతులు నిజమైన భారత కుబేరులు అంటూ కితాబు ఇచ్చారు ఈ ఆదర్శ దంపతుల విదేశీ యాత్రలు సోషల్ మీడియాలో హల్ చల్ కావడంతో ఆనంద్ మహేంద్ర వారిపై ప్రసంశలు కురిపించాడు.
పొదుపుతో:
రోజు రూ.300 రూపాయల పొదుపుతో కొచ్చిలో ఉన్న విజయన్ దంపతుల టీ స్టాల్ బాగా ఫేమస్ రోజు 350 మందికి క్యాటరింగ్ చేస్తారు. తమ కలలను నెరవేర్చుకొనేందుకు వీరు రోజు రూ.300 రూపాయలు పొదుపు చేస్తారు.
ప్రణాళిక:
తక్కువ మొత్తంలో ఖర్చులు పెడుతూ విదేశాలలో తిరుగుతారు. ఇప్పటికే సింగపూర్, అర్జెంటీనా, స్విజర్లాండ్, బ్రెజిల్, మొత్తం 23 దేశాలు చుట్టివచ్చిన విజయన్ దంపతులు మరిన్ని దేశాలలో కూడా చుట్టి రావడానికి ప్రణాళిక కూడా వేసుకున్నారు.
1963 లో:
దేశదేశాలు చుట్టి రావాలి అని నా చిన్ననాటి కల దానికోసం సొమ్ము కావాలి దానికోసమే నిలకడగా ఆదాయాన్ని ఇచ్చే టీ వ్యాపారం మొదలు పెట్టాను అని చెప్పారు విజయన్ 1963 లో ప్రారంభమైన విజయన్ టీ స్టాల్ కి విదేశీ యాత్రికుల తాకిడి ఎక్కువే ఇతర దేశాలు తిరగడం వల్ల ఏమి నేర్చుకున్నారు అని అడిగితే మన సంస్కృతి, మన మైండ్ లో మార్పులు చోటు చేసుకుంటాయి అని సమాధానం ఇచ్చాడు.
ఆనంద్ మహేంద్ర:
జీవితంలో బ్రతకడానికి డబ్బు ఒక్కటే కాదు గొప్ప సంకల్పం కూడా ఉండాలి అని చెబుతున్న ఈ వృద్ధ దంపతులు నిజంగా గ్రేట్ అని అంటారు. సంపద విషయంలో ఈ దంపతులు ఫోబ్స్ లిస్ట్లో లేకపోవచ్చు. కానీ నా ఉద్దేశంలో భారతదేశంలో విజయన్ దంపతులు కుబేరులు అని ఆనంద్ మహేంద్ర పేరుకొన్నారు.
ట్విట్టర్:
ఈసారి కొచ్చి వెళ్ళినప్పుడు వారి దగ్గరకి వెళ్లి ఒక టీ తాగి వారి విదేశీ యాత్రల గురించి తప్పక తెలుసుకుంటా అని ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్ లో తెలిపారు.