మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.ప్రధాన నగరాల్లో ధరలు ఈవిదంగా.
పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి గురువారం డాలర్ తో పోల్చిచూస్తే రూపాయి విలువ తరుగుదల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి.
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి గురువారం డాలర్ తో పోల్చిచూస్తే రూపాయి విలువ తరుగుదల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా పెరిగాయి. గురువారం దరల సవరణ తరువాత, పెట్రోల్ పై 13-14 పైసలు పెరిగి, డీజిల్ పై ధర 18-20 పైసలు పెరిగింది.దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.70.47 రూపాయలకు పెరిగింది. బుధవారం నాడు 70.33 దూపాయాల వద్ద దార ఉంది. డీజిల్ ధర రూ.64.78 రూపాయలకు చేరుకుంది.
ముంబయిలో పెట్రోలు ధర రూ.76.11 కు పెరిగింది. నిన్నటి ధర రూ. 75.97 ఉండగా నేడు 14 పైసలు పెరిగింది. ముంబైలో డీజిల్ ధర రూ.67.82 రూపాయలు,నిన్నటి ధర 67.62 రూపాయల ఉండగా నేడు 20 పైసలు పెరిగింది.
చెన్నై, కోల్కతాల్లో పెట్రోలు పై 15 పైసలు,14 పైసలు పెరిగి రూ.73.15 రూపాయలకు, రూ.72.58 రూపాయలకు చేరాయి. డీజిల్ చెన్నైలో 20 పైసలు పెరిగి రూ .68.42 రూపాయలకు చేరింది,కోల్కతా లో డీజెల్ పై 19 పైసలు పెరిగి 66.55 రూపాయలకు చేరింది.
నోయిడాలో పెట్రోలు పై ధర 11 పైసలు పెరిగి రూ.70.34 రూపాయలకు పెరిగింది. బుధవారం ధర రూ. 70.23 రూపాయలుగా ఉంది, డీజిల్ ధర రూ .64.10 కు చేరింది. గురుగ్రామ్ లో పెట్రోల్ పై 11 పైసలు పెరిగి రూ.71.37 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర రూ.64.71 రూపాయలకు పెరిగింది.
ఆసియా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ ఆసియాలో ఉదయం వాణిజ్యంలో బ్యారెల్కు 52 డాలర్లు, అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ 34 సెంట్లు లేదా 0.6 శాతం క్షీణించి $ 60.98 కు చేరాయి.