రూల్స్ ను బ్రేక్ చేసినోళ్లను పట్టిస్తే...రూ.1000 ఎలాగో తెలుసా?
ఇక నుంచి ప్రజలే పోలీసులు ఇప్పటినుంచి రోడ్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారిని మీరు కూడా పట్టించచ్చు. ఆ పని చేసినందుకు పట్టించినవారికి డబ్బులు కూడా ఇస్తాము అని గోవా పోలీసులు ప్రకటించారు.
ఇక జస్ట్ మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీరు కూడా ట్రాఫిక్ పోలీసైపోవచ్చు ఎలా అంటే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారి ఫోటో తీసి పోలీస్ వారి యాప్ లో అప్ లోడ్ చేయాలి ఒక్కో రకమైన ఉల్లంఘనకు ఒక్కో రేటు నిర్ణయించారు.
ఎంతమందిని ఏ కారణం చేత పట్టించారు అని పట్టి రివార్డ్ ఇస్తారు ఇలా వంద పాయింట్లు వస్తే రూ.1000 ఇస్తారు. ఈ ఆఫర్ గోవా పోలీసులు ఫేస్బుక్ లో బాగా ప్రచారం చేస్తున్నారు
రివార్డు
పాయింట్లు
ఇలా
ఉన్నాయి:
- రాంగ్ రూట్ డ్రైవింగ్ : 10 పాయింట్లు
- ఫుట్ పాత్ పైన పార్కింగ్: 3 పాయింట్లు
- ట్రిపుల్ రైడింగ్: 10 పాయింట్లు
- నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం : 3 పాయింట్లు
- సీట్ బెల్ట్ లేకపోవడం:3 పాయింట్లు
- హెల్మట్ లేకపోవడం:3 పాయింట్లు
ఇక వీడియోతో పట్టించాల్సినవి :
- రెడ్ సిగ్నల్ జంపింగ్ : 10 పాయింట్లు
- ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ : 10 పాయింట్లు
- సెల్ ఫోన్ డ్రైవింగ్ :10 పాయింట్లు
ఈ ఆఫర్ కొంతమంది మంచిగా ఉంది అని మెచ్చుకుంటే మరికొందరు ఎగతాళి చేస్తున్నారు మరికొందరు రూల్స్ బ్రేక్ చేసేవారి తిక్క కుదురుతుంది అని అంటున్నారు. మరి మేము ఈ పని చేస్తే మరి ట్రాఫిక్ పోలీసులు ఏమి చేస్తారు అని మరికొందరు అంటున్నారు. నా ముందు రూల్స్ బ్రేక్ చేసే వాడిని ఫోటో తీస్తుంటే నా ఫోటో ఎవడన్నా తీస్తాడు అని మరికొందరు అంటున్నారు.