ఇకనుంచి ఆ కూలాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కేంద్ర కేబినెట్ సంచలన నీర్ణయం
కేంద్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకొంది ఇప్పటి వరకు బీసీ, ఎస్ సి, ఎస్ టి లకు మాత్రమే ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు అగ్రవర్ణాల పేదలు కూడా అమలు చేయడానికి కేంద్రం సిద్ధం అవుతోంది.
ఆర్ధికంగా వెనకపడ్డ అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది విద్య , ప్రభుత్వ ఉద్యోగాలలోఈ కోట అమలు చేయాలి అని మోడీ ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
దీని పై రాజ్యాంగంలో ఆర్టికల్ 15 సవరించి లోక్ సభలో ఆమోదం కూడా తీసుకున్నారు ఈ నిర్ణయంతో రిజర్వేషన్ లో 50 శాతం నుండి 60 శాతం చేరుతున్నాయి. కులం ఆధారంగా కాకుండా ఆర్ధిక వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు ఉండాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ డిమాండ్ కారణంగా మోడీ సర్కార్ రిజర్వేషన్ బిల్ ఆమోదించడంతో అగ్రవర్ణాల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక 2019 లోక్ సభ ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మరో వైపు ఏది మొత్తం ఎన్నికలు దగ్గర వస్తుండడంతో చేస్తున్న ఎన్నికల స్టంట్ అనిన్ కొందరు అంటున్నారు.