స్టూడెంట్స్ కీ అదిరిపోయే శుభవార్త...! లాప్ టాప్ లు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ ఎక్కడో తెలుసా?
విద్యార్ధులకి చిన్నప్పటి నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం అందిచాలి అని తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఉచిత ల్యాప్ టాప్ పధకాన్ని పొడిగించి రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభుత్వం దాని అనుబంధ బడులలో 9 మరియు 10 తరగతులు చదువుతున్న విద్యార్ధులకి ప్రభుతం ఉచితంగా ల్యాప్ టాప్ ఇవ్వాలి అని ఆలోచిస్తోంది.
ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖమంత్రి కే.ఏ. తిరు సేన్ గొట్టైయన్ అధికారంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.సచివాలయ అధికారుల నివేదిక ప్రకారం విద్యార్థుల ఉచిత ల్యాప్ టాప్ పంపిణి విషయం పై మంత్రిగారు ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో చేర్చించారు అని ఆర్ధిక ఆమోదం కోసం ఈ కోరికను కేంద్రానికి పంపించారు అని సచివాలయ అధికారులు తెలిపారు.
తమిళనాడులో దివంగవనేత మాజి ముఖ్యమంత్రి జయ లలిత గారు మొదటిసారిగా 2011 నుంచి 2012 లో 12 వ తరగతి విద్యార్ధులకి ఉచిత ల్యాప్ టాప్ పంపిణి చేశారు.ఆ తర్వాత 11 వ తరగతి విద్యార్ధులకి కూడా ఈ పథకం అమలు చేశారు.ఇక రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల పైనే ల్యాప్ టాప్ లు విద్యార్ధులకి అందించింది.