రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్... ఇకపై పూర్తి ఉచితంగా ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్
పట్టణాలలో ఉచితంగా ఇకపై వైఫై సేవలు అందించేందుకు ప్రభుత్వం పనులు చేయబడుతోంది. ఇక ఈ వైఫై అందరికి వచ్చే నెల 15 నాటికీ అందరికి అందుబాటులో ఉండేలాగా చూస్తోంది.
రాష్ట్రంలోని:
రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీలోని 970 ప్రాంతాలలో ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేస్తాము అని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర ప్రకటించారు.
వచ్చే నెల:
ఏపీ డిజిటల్ ఇంఫ్రా, ఏపీ ఫైబర్ నెట్ కార్యకలాపాలను వేగవంతం చేయాలి అని పట్టణాలలో వైఫై సేవలని త్వరగా పూర్తి చేయాలి అని ప్రభుత్వం అనుకుంటుంటోంది. వచ్చే నెల 15 లోపు అన్ని మునిసిపాలిటీలలో వైఫై ఉచిత సేవలు అందనున్నాయి.
గూగుల్ సంస్థ:
గూగుల్ సంస్థ సహకారంతో ప్రభుత్వం ఈ వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇక భవిషత్తులో రాష్ట్రంలో 5 జి సేవలను అందించేందుకు ముందుగా ప్రభుత్వం వైఫై సేవలను ముందుకు తీసుకొస్తోంది.
అత్యాధునిక టెక్నాలజీ:
రాష్ట్రంలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకు పలు సేవలు అందిస్తోంది. విద్యార్థులు. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఇంటర్ నెట్ సాయంతో కార్యకలాపాలు సులువుగా చేపట్టేలాగా ప్రభుత్వం ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొస్తుండడంతో పట్టణ ప్రజల నుంచి ఆనందం వ్యక్తం అవుతోంది.
ప్రభుత్వ కార్యాలయాలలో:
ప్రభుత్వ కార్యాలయాలలో ఇంటర్ నెట్ సరిగ్గా పని చేయక సకాలంలో సేవలు అందకపోవడం వల్ల ప్రజలు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. వైఫై సేవలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రజలకు మంచి సేవలు అందుతాయి.
లావాదేవీలు:
అలాగే బ్యాంకులు వ్యాపార సంస్థలు తమ లావాదేవీలు వేగంగా అందిచే అవకాశం వస్తుంది, అలాగే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్రైవేట్ ఆపరేటర్ల సహాయంతో డబ్బులు వెచ్చించి ఇంటర్ నెట్ వాడుతున్న సకాలంలో సేవలు అందడం లేదు.
ఏపీ ఫైబర్ నెట్:
ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వైఫై సేవలను అందరికి అందిస్తే ప్రతి సామాన్యుడికి కూడా ప్రతి డిజిటల్ సేవలు కూడా ఉచితంగా అందుతాయి చూడాలి మరి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో?