సైరా నరసింహ రెడ్డి సినిమాకి చిరంజీవి తీసుకుంటున్న డబ్బు ఎంతో తెలుసా?
మొన్న రంగస్థలం తరువాత వస్తున్న రామ్ చరణ్ సినిమా వినయ విధేయ రామ ఏది కూడా భారీ అంచనాలతో విడుదలకి సిద్ధమవుతోంది ఇక రామ్ చరణ్ విషయంలో తండ్రి చిరంజీవి ఆనందానుభూతుల్ని ఆస్వాధిస్తున్నారు. ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా చరణ్ సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక .వినయ విధేయ రామ దాదాపు రూ.120 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా అంతే మొత్తం షేర్ వసూలు చేస్తుందని మాస్ లో దూసుకెళుతుందని సినిమా టీమ్ నమ్మకంగా ఉంది..
ఈ సినిమా కోసం చిత్ర నిర్మాత దానయ్య నుంచి 20కోట్లు పైగానే పారితోషికం అందుకున్నాడని ప్రచారమవుతోంది.ఇది అంతా ఎందుకు చెబుతున్నాము అని అనుకుంటున్నారా? రామ్ చరణ్ సినిమా కి ఇంత డబ్బు తీసుకుంటుంటే మరి రామ్ చరణ్ నిర్మాతగా తీస్తున్న సినిమాకి మెగా స్టార్ చిరంజీవి ఎంత తీసుకుంటున్నాడో సురేఖ కొణిదెల సమర్పణలో చరణ్ నిర్మాతగా.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థ నిర్మిస్తున్న సైరా చిత్రంలో నటించినందుకు చిరుకు ఎంత పారితోషికం ఇస్తున్నారు? ఒక ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్నను రామ్ చరణ్ ని అడిగితే అయన ఒక ఆసక్తికర సమాధానం చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి గారికి అయన ఎంతవరకు తీసుకోని డబ్బు ఇస్తున్నాను అని అయన చెప్పారు. రామ్ చరణ్. సైరా చిత్రం కోసం ఏకంగా 200కోట్లు పైగా బడ్జెట్ కేటాయించామని భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రమిదని చరణ్ తెలిపారు. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ సాగుతుందని అన్నారు. బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదు. సైరా చిత్రాన్ని కేవలం దక్షిణాది వరకే విడుదల చేయాలనుకుంటున్నాం. బాలీవుడ్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. ఎక్కువ ఆశ పడటం లేదు అని అన్నారు మూలం: తుపాకీ