పండగ ముందు ప్రజలకు మరో పెద్ద షాక్... రేపటి నుంచి బ్యాంకులు బంద్...!
ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు మరో సారి సమ్మె బాట పట్టారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వచ్చే వారం స్టేట్ యూనియన్లు ఈ నెల 8 మరియు 9 వ తేదీలో రెండు రోజుల పటు సమ్మెకు దిగనున్నాయి. దీనికి మద్దతుగా తాము కూడా రెండు రోజుల పాటు పాల్గొంటున్నటు రెండు బ్యాంకులు ప్రకటించాయి.
ఈ మేరకు అల్ ఇండియా బ్యాంకు అసోసియేషన్ , బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ అఫ్ ఇండియా రెండు కలిసి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కి సమ్మె నోటీసులు ఇచ్చాయి.ఈ నెల 8 మరియు 9 తేదీలలో సమ్మెకు దిగనున్నట్లు నోటీసుల్లో పేరుగొన్నారు.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా ఈ నెల 8 మరియు 9 బ్యాంకింగ్ సేవలకు విఘాతం కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకు సంబంధించిన వేలాది మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనున్నారు దింతో ఆ రెండు రోజులు బ్యాంకింగ్ సేవలు అంతరాయం కలగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తమ 12 డిమాండ్లు తీర్చాలి అని అన్ని బ్యాంకు యూనియన్లు కోరుతున్నాయి. డిసెంబర్ 26 న దేశవ్యాప్తంగా 9 బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేసిన విషయం తెలిసిందే దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.
బ్యాంకు అఫ్ బరోడాలో దేనా బ్యాంకు మరియు విజయ బ్యాంకు విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. రెండు వారాల వ్యవధిలో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు.