పెట్రోల్,డీజిల్ ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి.ధరలు పరిశీలించండి.
రెండు రోజుల విరామం తరువాత శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ 20-21 పైసలు తగ్గాయి అలాగే డీజిల్ ధర లీటరుకు 21-23 పైసలు పడిపోయింది.
రెండు రోజుల విరామం తరువాత శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ 20-21 పైసలు తగ్గాయి అలాగే డీజిల్ ధర లీటరుకు 21-23 పైసలు పడిపోయింది.దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ శుక్రవారం రూ.68.44 రూపాయల వద్ద విక్రయించింది ఇది నిన్న 68.65 రూపాయలుగా ఉంది మరియు డీజిల్ ధర రూ.62.44 రూపాయలకు చేరుకుంది. గత ఏడాది మార్చి నుంచి డీజెల్ ధరలు అత్యల్పంగా ఉండగా పెట్రోలు ఒక్క సంవత్సరంలోనే అతి తక్కువ స్థాయికి చేరిన విషయం గమనించవచ్చు.
నోయిడా, గురూగ్రాంలలో పెట్రోలు 16 పైసలు తగ్గాయి. పెట్రోల్ ధర రూ .69.77, రూ. 68.74 మరియు డీజిల్ పై 18 పైసలు తగ్గి లీటర్ కు ధర రూ.62.71, రూ. 62.10 రూపాయల వద్ద ఉంది.
దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలో పెట్రోల్ ధర రూ.74.10 రూపాయల ధర ఉంది నిన్నటి ధరతో పోల్చిచూస్తే 20 పైసలు తగ్గింది అలాగే డీజిల్ నిన్నటి తో పోల్చిచూస్తే 22 పైసలు తగ్గి రూ.65.34 రూపాయలకు చేరుకుంది.
చెన్నై, కొలకత్తాల్లో పెట్రోల్ ధర రూ.71.01 రూపాయలు, రూ.70.58 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ రూ.65.91 రూపాయలు, రూ.64.21 రూపాయల మేరకు విక్రయించింది.
శుక్రవారం అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఆసియా మార్కెట్లో బ్యారెల్కు 55 శాతానికి పడిపోయి 39 సెంట్లు లేదా 0.7 శాతం క్షీణించాయి.
అక్టోబరు ప్రారంభంలో పెట్రోలు, డీజిల్ ధరలు 20 శాతం వరకు పడిపోయాయి. ఈ మూడు నెలల్లో ముడి ధరలు దాదాపు 40 శాతం తగ్గాయి. ముడి ధర పతనం భారతదేశానికి తీపి కబురు అని చెప్పవచ్చు ఎందుకంటే దేశంలో 80 శాతం కంటే ఎక్కువ ముడి అవసరాలకు దిగుమతి చేస్తుంది. ఇది దేశ కరెంట్ ఖాతాలోటును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఆర్బిఐ నుండి రెపో రేటును తగ్గించాలన్న ఆశలు పెంచుతుంది.