గత కొన్ని సంవత్సరాల నుంచి టెలికాం రంగంలో ఒక సంచలనం సృష్టించింది ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో, కానీ జియోకి ముందు బీఎస్ఎన్ఎల్ అందరి ఇష్టమైన నెట్ వర్క్ కానీ బీఎస్ఎన్ఎల్ ఇచ్చిన ఆఫర్లు చూస్తుంటే మళ్ళీ వినియోగదారులకి దగ్గర అవుతుంది అని అంతానుకుంటున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్లు తెచ్చింది. వాటి ప్రకారం మొబైల్ యూజర్లు వర్షికా-1699 ప్లాన్ కింద రూ.1,699తో ఏడాదిపాటు అపరిమిత (లోకల్ అండ్ రోమింగ్) వాయిస్కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు, ఫ్రీ కాలర్ట్యూన్, అన్లిమిటెడ్ డేటా పొందొచ్చు. డేటా యూసేజ్ రోజుకు 2జీబీ దాటితే, ఆ తర్వాత డేటా స్పీడ్ను 80 కేబీపీఎస్కు తగ్గిస్తారు. రూ.2,099తో రీచార్జ్ చేసుకునే వర్షికా ప్లస్-2099 ప్లాన్కూ ఇవే రూల్స్ వర్తిస్తాయి. కాకపోతే అందులో రోజుకు 4జీబీ వాడాక డేటా వేగాన్ని 80 కేబీపీఎస్కు తగ్గిస్తారు.

రూ.300 టాప్అప్తో రూ.30 అదనపు టాక్టైం పొందొచ్చు. గురు, శుక్ర, శనివారాల్లో రూ.250, సోమ, మంగళ, బుధవారాల్లో రూ.500, రూ.600 టాప్అప్తో 10 శాతం అదనంగా టాక్టైం వస్తుంది. కాంబో ఎస్టీవీ-175లో రూ.200, కాంబో ఎస్టీవీ-219లో రూ.250 టాక్టైంతో పాటు 0.5జీబీ డేటా 60 రోజుల టైమ్ లిమిట్తో ఇస్తున్నారు. కాంబో ఎస్టీవీ-252లో రూ.350 టాక్టైం, 2 జీబీ డేటా, కాంబో ఎస్టీవీ-402లో రూ.600 టాక్టైం, 4జీబీ డేటా 60 రోజుల కాలపరిమితితో లభిస్తున్నాయి.
తెలంగాణలో బీఎస్ఎన్ఎల్ మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ 487 వైఫై హాట్స్పాట్లను ఏర్పాటుచేసింది. మరో 423 హాట్స్పాట్లను రెండు నెలల్లో సెట్ చెయ్యబోతోంది. వీటి ద్వారా 100 మీటర్లలో 2 నుంచి 10 ఎంబీపీఎస్ వేగంతో రోజుకు 4 జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు పొందవచ్చు. చక్కటి ఆఫర్లు తెచ్చామన్న సంస్థ ప్రతినిధులు ఈ ఏడాది మరింత మంది యూజర్లు తమవైపు వస్తారని భావిస్తున్నామన్నారు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications