మరోసారి తగ్గినా పెట్రోల్ ధరలు.ప్రముఖ నగరాల్లో ధరలు పరిశీలించండి.
శనివారం పెట్రోలు, డీజిల్ ధరలు 30-32 పైసలు క్షీణించాయి.పెట్రోలు పై 30 పైసలు తగ్గగా, డీజిల్ పై ధర 32 పైసలు తగ్గింది.
న్యూఢిల్లీ:శనివారం పెట్రోలు, డీజిల్ ధరలు 30-32 పైసలు క్షీణించాయి.పెట్రోలు పై 30 పైసలు తగ్గగా, డీజిల్ పై ధర 32 పైసలు తగ్గింది. పెట్రోలు ధర ఢిల్లీలో 29 పైసలు తగ్గి రూ. 69.55 నుంచి రూ .69.26 కు పడిపోయింది అలాగే డీజిల్ ధర 30 పైసలు తగ్గించి రూ. 66.32 వద్ద ఉంది.
ముంబైలో పెట్రోలు ధరలు రూ.75 రూపాయల దిగువకు చేరింది. ఆర్థిక రాజధానిలో పెట్రోల్ శుక్రవారం రూ .75.18 తో పోలిస్తే నేడు రూ.74.89 వద్ద ఉంది మరియు డీజిల్ ధర 32 పైసలు తగ్గి రూ.66.25 వద్ద విక్రయించింది.
కోల్కతాలో పెట్రోలు రూ.71.37 రూపాయలు ఉంది శుక్రవారం ధర రూ.71.65 వద్ద ఉంది. లీటరు డీజిల్ పై 30 పైసలు తగ్గి రూ .65.07 వద్ద నిలిచింది. చెన్నైలో పెట్రోల్ ధర 31 పైసలు తగ్గించి రూ.72 రూపాయల దిగువకు చేరింది అలాగే డీజిల్ ధర రూ. 67 వద్ద ఉంది.
నోయిడాలో పెట్రోల్ ధర 12 పైసలు తగ్గి 68.35 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర 15 పైసలు తగ్గి లీటరుకు రూ. 62.82 వద్ద ఉంది.గురూగ్రాంలో గురువారం పెట్రోల్ పై 42 పైసలు తగ్గి రూ.70.21 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ నగరంలో 45 పైసలు తగ్గి రూ .63.26 వద్ద విక్రయించింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు శనివారం తగ్గాయి.బ్రెంట్ ముడి చమురు 56 సెంట్లు తగ్గి $ 51.60 బ్యారెల్కు పడిపోయింది.
దేశంలో ముడి చమురు ధర 80 శాతం కంటే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న భరత్ కు మంచి లాభం చేకూరే అంశం. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల దేశం యొక్క కరెంట్ అకౌంట్ లోటు తగ్గుతుంది.